కోస్గి, నవంబర్ 23 : రోడ్డు విస్తరణ పనులు త్వరలో చేపట్టాలని అదనపు క లెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయా న్ని బుధవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం రోడ్డు విస్తరణకు సంబంధించిన రికార్డులను తని ఖీ చేసి అధికారులతో కలిసి రోడ్లను పరిశీలించారు. బృందావన్ కాలనీలోని ఎర్రకుంట పాటుకాలువను పరిశీలించారు. కాలువ కబ్జా చేసి న భవనాలను తొలగించి కాలువను నిర్మించాలన్నారు.
త్వరలో ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించి కాలువ నిర్మాణం చేయిస్తానన్నారు. ము న్సిపాలిటీలో ఏఈ లేకపోవడంతో పనులు నిర్వహించడం లేదని పలువురు కౌన్సిలర్లు అదనపు క లెక్టర్కు వినతిపత్రం అందజేశారు. త్వరలో ము న్సిపాలిటీకి ఏఈని ఇస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద ర్, మేనేజర్ శంకర్నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.