మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 30 : నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుందని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్వపు ఓఎస్డీ రంగారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నదీ జలాల పరిరక్షణపై పాలమూరు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, వి ద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం పీయూలో అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్రెడ్డి, ఎన్సీఆర్టీ, ఎం హెచ్ఆర్డీ సభ్యుడు మురళీ మనోహర్, తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కన్వీనర్ లక్ష్మీనారాయణ, జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి కూడా అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య రా ష్ట్రంలో అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. అందుకే ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ర్టా న్ని సాధించుకున్నామని తెలిపారు. అయితే అంతకుముం దు ప్రతిపాదనలో ఉండి ఆమోదం ఉన్న డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వాటర్ స్టోరేజీ పెంచుకుంటే మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాకు నీరందేదన్నారు. ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ ఆవశక్యతను విద్యార్థులకు వివరించారు. ప్రాజెక్టులపై వి ద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో పీయూ పరీక్ష నియంత్రణ అధికారి నాగం కు మారస్వామి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.