మహబూబ్నగర్ మెట్టుగడ్డ/పెబ్బేరు, ఏప్రిల్ 1: గుండె లయ తప్పితే జీవితమే చేజారిపోతుంది. శరీరానికి గుండె ఇంజిన్లాంటిది. హృదయ స్పందన పెరిగినా.. తగ్గినా సమస్య ఉన్నట్లే. ఆహారపు ఆలవాట్లు.. వ్యాయామం మన గుండె పనితీరుకు రక్షణ కవచం. మారుతున్న జీవన విధానం వల్ల రక్తపోటు సమస్య ఎక్కువైంది. గుండెజబ్బులపై అప్రమత్తత, అవగాహన పెంచుతూ 2027 నాటికి గుండె జబ్బు మరణాలు 25శాతం తగ్గించాలనే ఉద్దేశంతో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పనిచేస్తోంది.
సీపీఆర్పై శిక్షణకు ఐదుగురు వైద్యులు
ఇటీవల కాలంలో గుండెపోటు మరణ వార్తలు అధికంగా వింటున్నాం. వయస్సుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా కుపకూలిపోతున్నారు. గుండెపోటుకు గురైనవారిని సీపీఆర్ చేసి బతికించొచ్చని చాలామందికి తెలియని విషయం. ఈ దిశగా ప్రజలకు ఆవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిత్యం ప్రజల మధ్య ఉండే కొన్ని శాఖల సిబ్బందికి సీపీఆర్పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. మహబూబ్నగర్ జిల్లా నుంచి డాక్టర్లు నరేశ్, శివకాంత్తోపాటు మరో ముగ్గురిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని ఎంపిక చేసిన అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికి సీపీఆర్పై శిక్షణ ఇస్తున్నారు.
సీపీఆర్ అనగా..
అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు, శారీరక శ్రమ జరిగినపుడు మనిషి సైకలాజికల్ షాక్కు గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. ఫలితంగా గుండె లయతప్పి, శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. ఆ సమయంలో ఛాతిపై పదేపదే ఒత్తిడి చేస్తూ నోటిద్వారా కృత్రిమ శ్వాసను అందించడం ద్వారా గుండెను, ఊపిరితిత్తులను తిరిగి పనిచేయించడాన్నే సీపీఆర్ అంటారు.
సీపీఆర్ ఎలా చేయాలి
ప్రస్తుతం చాలామంది సడన్ కార్డియాక్ అరెస్ట్కు గురవుతున్నారు. ఈక్రమంలో 10మందిలో ఒక్కరే ప్రాణాలతో బయటపడతున్నారు. సీపీఆర్ చేస్తే 10 మందిలో ఐదుగురిని కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని పక్కకు జరిపి పడుకోబెట్టాలి. పక్కవారు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేయాలి. తట్టి చూసినప్పుడు రెస్పాండ్ కాకపోతే గుండెచప్పుడు గమనించాలి. ఆ తర్వాత సీపీఆర్ మొదలుపెట్టాలి. ఇలా రెండు నిమిషాలు చేస్తూ ప్రతీ 30సార్లకు ఒకసారి నోటి నుంచి శ్వాస అందిస్తూ ఐదుసార్లు చేయాలి. అంబులెన్స్ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి ఒకప్పుడు 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు 30 ఏండ్ల వారికి కూడా మాములైపోయింది. ప్రపంచంలో1.75 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తే దేశంలోనే 95లక్షలకు పైగా గుండె జబ్బు మరణాలు నమోదవుతున్నాయి. మధుమేహం, ఊబకాయం వంటివి గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. సీపీఆర్ను సామాజిక బాధ్యతగా స్వీకరిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు.
శరీరానికి ఇంజన్ ‘గుండె’
వాహనానికి ఇంజన్ ఎంత ముఖ్యమో.. మనిషి శరీరానికి గుండె అంతకన్నా ముఖ్యం. ప్రతి అవయవానికి తగినంత ఆక్సిజన్.. పోషక పదార్ధాలు(న్యూట్రిన్స్) సరఫరా నిరంతరం జరుగుతూ ఉండాలి. రక్తనాళాల ద్వారా రక్తంతోపాటు ఆక్సిజన్ను గుండె పంప్ చేస్తుంటే శరీర అవయవాలన్నింటికీ సరఫరా అవుతుంది. గుండె చెడురక్తాన్ని సేకరించి శుద్ధి చేస్తుంది. గుండె నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటేనే మనం ఆరోగ్యకరంగా ఉన్నట్లు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో ఏటేటా గుండెజబ్బు బాధితుల సంఖ్య పెరుగుతోంది. 2022లో గుండెజబ్బులతో ప్రభుత్వ దవాఖానకు ప్రజలు అధికసంఖ్యలో క్యూ కడుతున్నారు. వారిలో 15శాతం యువత ఉండడం గమనార్హం. మారిన జీవన విధానం, చ దువు, ఉద్యోగాల్లో ఒ త్తితే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు అంటున్నా రు. సంప్రదాయ ఆహారం దూరమై, జం క్ఫుడ్ దగ్గరవడం.. దీనికి తోడు మద్యం, ధూమపానం అలవాట్ల వ ల్ల ఉమ్మడిజిల్లాలో గుండెజబ్బుల బా ధితులు సంఖ్య పెరుగుతున్నదని ఇటీవల ప్రభుత్వం విడుదుల చేసిన హెల్త్బుల్టిన్ హెచ్చరించింది.
చేయించుకోవాల్సిన పరీక్షలు
ఈసీజీ: ఛాతిలో నొప్పి వస్తే తప్పనిసరిగా ఈసీజీ చేయించుకోవాలి. గతంలో ఎప్పుడో వచ్చిన గుండెపోటును కూడా దీంతో గుర్తించవచ్చు
గుండెకు రక్త ప్రసరణ సాఫీగా సాగినంత వరకు ఎలాంటి ముప్పు ఉండదు. గుండెపోటును గుర్తించిన వెంట నే సీపీఆర్ చేస్తే పోయే ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. కొన్ని దేశాల్లో ప్రతిఒక్కరికీ సీపీఆర్పై అవగాహన ఉండడం వల్ల చాలా వరకు మరణాలు అదుపులో ఉంటున్నాయి. గుండెపోటకు గురై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి ఛాతి పై రెండు నిమిషాలపాటు రెండు చేతులతో 30సార్లు ఒత్తిడి చేసి, రెండుసార్లు నోట్లో ఊదడం వల్ల గుండె తిరి గి కొట్టుకోవడం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం తీసుకొని ఈ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది. సీపీఆర్ కన్నా ముందుగా అంబులెన్స్కు కబురు చేసి ఉంచాలి. అది రాగానే దగ్గరలోని దవాఖానకు తీసుకెళ్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
– డాక్టర్ హరీశ్సాగర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వనపర్తి ప్రభుత్వ దవాఖాన