వనపర్తి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నుంచి వడ్లను తీసుకొని ధాన్యం చేసి ఇవ్వాల్సిన పలు రైస్ మిల్లులు మూడేండ్లుగా అలసత్వం వహిస్తున్నాయి. అ లాంటి వాటిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గత నెలలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సీఎంఆర్ ధాన్యం సేకరణపై ఆరా తీసి లోపాలను గుర్తించారు. ఈ క్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిపై బదిలీ వేటు పడింది. రైస్ మిల్లర్లు, రైస్మిల్ అసోసియేషన్ సభ్యులతో పలుమా ర్లు సమావేశం నిర్వహించారు. గడువులోగా ఎఫ్సీఐకి ఇ వ్వాల్సిన బియ్యాన్ని వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో రెవె న్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. దీంతో రైస్ మిల్లర్లు బియ్యం అప్పగించే పనులు షురూ చేశారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం 3,570 ఏసీకేలుండగా, మిల్లర్లు జనవరిలో 940 ఏసీకేల బియ్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఫి బ్రవరి చివరి వరకు జిల్లాలో పెండింగ్లో ఉన్న బియ్యాన్ని పూర్తిస్థాయిలో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైస్ మిల్లుల్లో చీఫ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఐదు మిల్లుల్లో ప్రత్యేక బృందం గతంలో తనిఖీలు చేపట్టింది. కొత్తకోట మండలం మిరాసిపల్లి పరిధిలోని ఇషాన్ ట్రేడ ర్స్, పాన్గల్ మండలం మహ్మదాపురంలో మీనాక్షి ఫుడ్ ప్రొడక్షన్, వనపర్తిలోని కేదర్నాథ్ రైస్మిల్, పాన్గల్ పరిధిలోని ఇషాన్ ఆగ్రో, పరమేశ్వర రైస్మిల్లులపై గత నెల లో పౌరసరఫరాల శాఖ కేసులు నమోదు చేసింది. కేంద్ర ఆహార సంస్థకు బియ్యం పెట్టకపోవడంతోపాటు మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం బస్తాల లెక్కల్లో భారీ తేడాను అధికారులు గుర్తించారు. దాదాపు 2,25,179 బస్తాల ధాన్యం లోటు ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. అయితే ఇందుకు అంగీకరించని ఓ యజమాని రాష్ట్ర అడ్వకేట్ కౌన్సిల్ను ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ తతంగంపై రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్, ప్రధాన విజిలెన్స్ అధికారి ప్రకాశ్ ఆధ్వర్యంలో ప్ర త్యేక బృందం మళ్లీ తనిఖీ చేస్తున్నది. ఇందులో ప్రధానం గా ధాన్యం బస్తాలను లెక్కించడం ద్వారా ఎంతమేర లోటు ఉందనే స్పష్టత రానున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ వెల్లడించారు.