మూసాపేట(అడ్డాకుల), జవనరి 9 : ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం అడ్డాకుల ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎం పీపీ దోనూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రాంచంద్రాపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం ఉన్నతాధికారులతో అనుమతి తీసుకున్నా ఎందుకు ఏర్పాటు చేయలేదని విద్యుత్ శాఖ ఏఈ అరుణ్నాయక్ను ప్రశ్నించారు. అందుకు ఏఈ నివేధికలు ఇంకా చేయలేదని చెప్పడంతో ప్రజల సమస్యలను పరిష్క రించకుంటే మీరేందుకు, ఇంక మేమెందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాయిపల్లి తండాలో లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం నియంత్రిక వచ్చి నెలలు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వక పోవడంతో సమస్య అలాగే ఉందని సర్పంచ్ కిషన్ సభలో వివరించారు.
రాచాలలో 8 విద్యుత్ స్తంభాలకు వైరు లేక వృథాగా ఉన్నాయని సర్పంచ్ తిరుపతయ్య యాద వ్ సభ దృష్టికి తెచ్చారు. గుడిబండకు ప్రత్యేక ఫీడర్ లేక అవ స్థలు పడుతున్నారన్నారు. పొన్నకల్ గ్రామ పంచాయతీకి రూ. 6,7 వేలు వచ్చే కరెంటు బిల్లు ఒకే సారి రూ. 59 వేలు ఎలా వస్తుందని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి ఏఈని ప్రశ్నించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసు కొచ్చారు. మనఊరు మనబడి కార్యక్రమంలో చేపడ్తున్న నిర్మాణాలను ఏఈ, డీఈలు పరిశీలించడం లేదని, వారు మండల సమా వేశానికైనా వస్తే మా సమస్యలు చెప్పుకునేవాళ్లమని, ఎస్ట్టిమె ట్ లేకున్నా సర్పంచులతో చేయించిన ఉపాధి పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని శాఖాపూర్ సర్పంచ్ జయన్నగౌడ్ సభ దృష్టికి తెచ్చారు. అందుకు జెడ్పీటీసీ స్పందిస్తూ ఎస్టీమెట్ లేకుండా పనులు చేయిస్తే బిల్లు లు ఎలా చెల్లిస్తారని, బిల్లులు రాక సర్పంచులు ఇబ్బం దులు పడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిమ్మాయిపల్లి తండాలో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసి అధికారులను అదేశించారు. కందూరు ప్రాథమిక పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉందని, విద్యార్థులను వేరే చోటుకు మార్చాలని సూచించినా ఎందుకు మార్చలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని జెడ్పీటీసీ ఎంఈవో నాగయ్యను ప్రశ్నించారు. అందుకు ఎంఈవో మాట్లాడుతూ ప్రధానోపాద్యాయుడికి చెప్పినా వినడం లేదని, అతనికి తాను చెప్పలేనని అనడంతో జడ్పీటీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పాఠశాలను మార్చాలని సూచించారు. అడ్డాకుల వైన్స్షాపులో ప్రతి సీసాకు రూ.10 ఎక్కువగా తీసుకుం టుంటే మీరేం చేస్తున్నారని ఎక్సైజ్ ఎస్సై ఉమామహేశ్వర్ను తిమ్మాయిపల్లి సర్పంచ్ కిషన్ ప్రశ్నించగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. అదేవిధంగా ఆయా శాఖల అధికారులు ఎజెండా నివేధించారు.
డబ్బులివ్వనిదే ఎంబీ కదలదు
గ్రామాల్లో చేసిన పనులకు అధికారులకు డబ్బులు చెల్లిం చకుంటే ఎంబీలు చేయడంలేదని సర్పంచ్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు తెచ్చి చేసిన పనులకు పర్సెంటేజీలు ఇ వ్వాలంటే మాకేం మిగులు తుందన్నారు. అందుకు జడ్పీటీసీ సభలో నుంచే పీఆర్ డీఈతో ఫొన్లో మాట్లాడుతూ మీ వ్యవ హారంతో సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనిపై ప్రత్యేకంగా చర్చిద్దామన్నారు.
మండల సర్వసభ్య సమావేశానికి మహిళా సర్పంచులతో పాటు పతులు హాజరయ్యారు. సభకు హాజరు కావడంతో పాటు అధికారులను వారే ప్రశ్నించడం, వారితో పాటు ఆయా గ్రామాలకు చెందిన కొంత మంది యువకులు కూడా సభలో కూర్చొని సమావేశాన్ని సెల్పోన్లో బంధించినా ఎంపీడీవో కార్యాలయ అధికారులు పట్టించుకోక పోవడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఎంపీడీవో మం జుల, వైస్ ఎంపీపీ రాధిక, సింగిల్విండో ఛైర్మన్ జితేందర్రెడ్డి, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాసులు, గ్రిడ్ డీఈ శ్రీనివాస్గౌడ్, ఏఈ ప్రశాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.