నాగర్కర్నూల్, ఏప్రిల్ 5: నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదస్థలం నుంచి సొరంగం లోపలికి వంద మీటర్ల పొడవునా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించడంతో మట్టి తొలగింపు పనులను వేగవంతం చేశారు. ఈ మేరకు శనివారం రెస్క్యూ బృందాలు వెంటిలేషన్ ప నులు చేపట్టారు. టన్నెల్ ప్రత్యేకాధికారి శివశంకర్ రెస్క్యూ బృందాల ప్రతినిధులతో స మావేశమై పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్ వ రకు కూలిపడిన మట్టిని తొలగించే విషయమై పలు సూచలను చేశారు. 40 రోజులు దా టినా సొరంగంలో చిక్కుకున్న వారిలో మిగిలిన ఆరుగురు ఆచూకీ బయటపడలేదు. దీం తో రెస్క్యూ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.
సహాయ చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ నిరంతరాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు పూర్తిస్థాయి లో నిర్విఘ్నంగా చర్యలు చేపడుతున్నట్లు ప్ర త్యేకాధికారి వివరించారు. రెస్క్యూ బృం దాలు రోజూమాదిరిగానే టన్నెల్లో స్టీల్ తొలగింపు పనులు, మట్టి తవ్వకాలు, ఊ టను బయటకు తరలించే ప్రక్రియ, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు చేరవేసే ప్రక్రియ, సమాంతరం గా జరుగుతున్నట్లు రెస్క్యూ బృం దాల ప్రతినిధులు పేర్కొంటున్నాయి.
జీఎస్ఐ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం టన్నెల్ ప్రమాదప్రదేశం వద్ద పరిస్థితులను గమని స్తూ సహాయక బృందాల ఉన్నతాధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇ స్తున్నట్లు ప్రత్యేకాధికారి వెల్లడించారు. శనివారం పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్ పొడవునా మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తున్నారు. శనివారం నిర్వహించిన స మీక్షా సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్సింగ్, సింగరేణి రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.