వీపనగండ్ల, జనవరి 26 : మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన కిష్టమ్మ, కాశన్న కూతురు బోరెల్లి జ్యోతి గణతంత్ర వేడుకల్లో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్నది. ఢిల్లీ శకటోత్సవంలో తెలంగాణ ఐలమ్మ, కొమురంభీం వేషధారణలో.. తెలంగాణ గుండె శబ్ధానికి కణకణ మోగే మృదంగ నాట్యం ఆ డుతూ ప్రజాస్వామ్య యోధులు థీమ్తో ప్రదర్శన ఇచ్చింది. బోరెల్లి జ్యోతి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జానపద ఎంఏ పూర్తి చేసి.. ప్రస్తుతం ఎం ఏ తెలుగు అభ్యసిస్తున్నది.
ఈమె సామాజిక స్పృహ కవిత్వం రాయడంలో దిట్ట, 2015, 2020లో తెలంగాణ శకటం వేడుకల్లో పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యా ప్తంగా శుక్రవారం గణతంత్ర దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు రవినాయక్, కోయ శ్రీహర్ష, తేజస్నందలాల్ పవార్, సంతోష్, ఉదయ్కుమార్ జెండాకు సెల్యూట్ చేశారు. పరేడ్గ్రౌండ్లలో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.
అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. చిన్నారుల ప్ర దర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయా జిల్లాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఎగురవేశారు. దీంతో వాడవాడనా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.