నారాయణపేట, అక్టోబర్ 21: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని 6వ వార్డులోని బీసీ కాలనీ, బాపూనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనుందన్నారు. దీంతో పేద ప్రజలు ఉపశమనం పొందుతారన్నారు. అలాగే సౌభాగ్యలక్ష్మీ పథకం కింద అర్హులైన పేద మహిళలకు నెలకు రూ. 3000 భృతి చెల్లించడంతోపాటు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా అమలు చేయనుందన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్ నారాయణమ్మ, మాజీ మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ జగదీశ్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మీ, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
దామరగిద్ద, అక్టోబర్ 21: మండలంలోని మొగల్మడ్క, కంసాన్పల్లి గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కంసాన్పల్లి గ్రామంలో సర్పంచ్ గురునాథ్గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ఎమ్యెల్యే ఎస్.రాజేందర్రెడ్డి గ్రామంలో చేపట్టిన అభివృధ్ధి పనులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మరోసారి ఎస్.ఆర్.రెడ్డికి ఓటు వేసి గెలిపిద్దామని కోరారు. మొగల్మడ్క గ్రామంలో వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, ఎంపీటీసీ కిషన్రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గడిమున్కన్పల్లి సర్పంచ్ సుభాష్, రైతుబంధు సమితి జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, కానుకుర్తి మాజీ సర్పంచ్ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరికల్, అక్టోబర్ 21: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో బడుగుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని బీఆర్ఎస్ నాయకుడు రాజవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వెంకటపూర్, రాకొండ, ఇబ్రహీంపట్నం, పస్పుల గ్రామాల్లో ఎమ్మెల్యే ఎస్.ఆర్.రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎస్.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో అభివృద్ది జరిగిందని అన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, బీసీ విభాగం అధ్యక్షుడు గాదం మల్లేశ్, యుత్ అధ్యక్షుడు గొల్ల రాజేశ్యాదవ్, నాయకులు నర్సింహారెడ్డి, నాగేశ్గౌడ్, తిమ్మయ్యగౌడ్, బాలస్వామి, మండల వినియోగదారుల ఫోరం సభ్యులు రాజేందర్రెడ్డి, రవి, చిన్నవెంకట్రాములు, రాజేశ్వర్ రెడ్డి, నరహరి, కుర్వఅంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ, అక్టోబర్ 21: ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిం చాలంటూ మండలంలోని గున్మక్ల కడపరాయ స్వామి ఆలయంలో జెడ్పీటీసీ విమలాదేవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే ధన్వాడ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ అమరేందర్ రెడ్డి ఇంట్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్దిని ప్రతి ఇంటికీ చేరవేసి కారు గుర్తుకు ఓటు వెయించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ కోఅప్షన్ సభ్యుడు వాహిద్, నాయకులు రాజవర్ధన్రెడ్డి, గున్మక్ల ఎంపీటీసీ సుధీర్కుమార్, సునీల్కుమార్ రెడ్డి, సచిన్, నర్సింహారెడ్డి, పటేల్ నర్సింహులు, చంద్రశేఖర్, ప్రతాప్రెడ్డి, బాలరాజ్, అంజియాదవ్, గౌని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, అక్టోబర్ 21: మండలంలోని మనికొండ, కోయిలకొండ తదితర గ్రామాల్లో పేట నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కర్త ఎస్. రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయిలకొండ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసి చూపించిన ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదిఅంజనేయస్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, కోఆప్షన్ సభ్యుడు ఖాజా, నాయకులు కుమ్మరి రాములు, మోదీపూర్ రవి, శ్రీనివాస్రెడ్డి, నారాయణగౌడ్, రాజు, శ్యామ్, లక్కిగౌడ్, నజీం, మోహిన్, గణేశ్, భరత్గౌడ్, నర్సింహులు, శివగౌడ్, రమేశ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.