అయిజ, డిసెంబర్ 9 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. టీబీ డ్యాం నుంచి విడుదలైన ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీరు ఆనకట్టకు చేరకపోవడంతో నిల్వ తగ్గుతున్నది. శనివారం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో నిలిచిపోగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 384 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.6 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందా స్ తెలిపారు. తుమ్మిళ్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.
టీబీ డ్యాంకు..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 640 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 2,535 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 12.494 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1,633 అడుగులకు గానూ 1,591.68 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.