మహబూబ్నగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.. జూరాల, కోయిల్సాగర్తోపాటు ఇ తర జలశయాల్లో ఉన్న కొద్ది పాటి నీటిని తాగునీటి కోసం రిజర్వు చేసే పరిస్థితులు రావడంతో పంటలు చేతికొచ్చే పరిస్థితి కానరావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు జీవనది అయిన కృష్ణమ్మ ఇటు జూరాల, శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో వేగంగా నీటి నిల్వలు అడుగంటుతున్నాయి.. ఈసా రి ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి తప్పేలా కనిపించడం లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, సం గంబండ, భూత్పూర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన జలశయాల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి.
గత నెలలో జూరాల, సంగంబండ, కోయిల్సాగర్ కింద ఆయకట్టుకు సాగునీరును విడుతల వారీగా అందించేలా ఒప్పందం కుదిరింది. ఇప్పుడు చివరి విడుత నీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు జీవనది అయిన కృష్ణానదిలో ఈసారి కర్ణాటక నుంచి వచ్చే కొద్దిపాటి ప్రవాహం కూడా ఆగిపోయింది. మరోవైపు తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఈసా రి యాసంగి పంటలు చేతికి వస్తాయా? లేదా అనే ఆందోళన అన్నదాతల్లో కనిపిస్తున్నది. ఫలితంగా ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. గతేడాది యాసంగికి మహబూబ్నగర్ జి ల్లాలో 1.50 లక్షల ఎకరాలు సాగు చేయగా ఈసారి 60 వేల ఎకరాలకు మించడం లేదు. బోరు బావుల కింద సాగు చేసిన పంటల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ పాలమూ రు నుంచి వలసలు తప్పేలా లేవని హెచ్చరిస్తున్నారు. పదేండ్లుగా కేసీఆర్ ప్రభుత్వంతో పచ్చబడిన పాలమూరు జిల్లా ఈసారి ఎండిపోతున్నది. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో వరి పంట నీళ్లు లేక నెర్రెలు బారుతున్నాయి.
గత తొమ్మిదేండ్లు గా ఈ పరిస్థితి ఎన్నడూ చూడలేదని రైతులు అంటున్నారు. చెరువులు, కుంటల వద్ద ఉన్న కొద్దిపాటి పం టలు మాత్రమే చేతికి వచ్చేలా కనిపిస్తున్నాయి. బోర్ల దగ్గర ఉన్న పంటలపై ఆశలు వదులుకునేలా పరిస్థితులు ఉన్నాయి. రోజురోజుకు భూగర్భ జలాలు అ డుగంటి పోతుండడంతో పాత బోర్లను రిపేరు చేయిస్తున్నారు. దీంతోనే ఖర్చు తడిసి మోపడవుతున్నది. మరోవైపు పంటలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు పంటలను పశువుల మేతకు వదులుతున్నారు. ఇదే పరిస్థితి మరో 20రోజులు కొనసాగితే పంటలన్నీ పూర్తి ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది తాగునీటికీ కష్టాలు తప్పవని అధికారులు ఇప్పటినుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని సంగంబండ, మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్సాగర్లో కేవలం ఒకటిన్నర టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉన్నాయి. కోయిల్సాగర్ జలాశయం నుం చి మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు తా గునీటిని ప్రత్నామ్నాయంగా అందించే వెసులుబా టు ఉన్నది. దీంతో రైతుల పరిస్థితి ఒకలాగా ఉంటే.. ఎండాకాలంలో నీటి ఎద్దడి తీవ్రతరం అయితే పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.
పాలమూరు జిల్లా ఎండుతోంది. జలం జఠిలమై పాతాళానికి చేరింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నీటితో జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు నేడు అట్టడుగు నీటిమట్టంతో కళావిహీనంగా తయారయ్యాయి. రిజర్వాయర్లు, కాల్వలు ప్రవాహం లేక వెలవెలబోతున్నాయి. దీంతో సాగు సందిగ్ధంగా మా రింది. రైతుల కల్పతరువైన జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల కింద ఇప్పటికే అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎత్తిపోతలకు నీటి పంపింగ్ నిలిచింది. ఎంజీకేఎల్ఐ ఆయకట్టు ప్రశ్నార్థకమైంది. దీనికి తోడు కరెంట్ కోతలు రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. యాసంగి సాగు అయోమయంగా మారగా..
విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మొన్నటి దాకా మాగాణుల్లా దర్శనమిచ్చిన పొలాలు నేడు నెర్రెలుబారాయి. బోర్లు, బావులు ఒట్టిపోగా.. సాగైన వివిధ పంటలు నీళ్లులేక ఎండిపోయి పశువుల పాలయ్యాయి. మునపటి రోజులు మళ్లీ దాపురించాయని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభంతో తాగునీటికి సైతం కష్టాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.