రావుల చంద్రశేఖర్రెడ్డి బీఆర్ఎస్లో చేరిడంతో ఇక వనపర్తిలో వార్ వన్సైడే కానున్నది. 40 ఏండ్లుగా టీడీపీ పార్టీలో వివిధ హోదాల్లో పదవులు నిర్వర్తించారు. ఆయనకున్న అనుబంధం వీడింది. గతంలో పార్టీలో ఉన్న సమయంలో రావులకు, సింగిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల, ఎంపీ రాములు సమక్షంలో గులాబీ గూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్కు మరింత బలం పెరిగింది.
వనపనర్తి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలో ఇక వార్ వన్సైడ్ కా నున్నది. 40 ఏండ్లపాటు టీడీపీలో కొనసాగిన రావుల చంద్రశేఖర్రెడ్డి శుక్రవా రం ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో రావుల గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పక్షం రోజుల నుంచి రావుల చేరికపై భిన్నాభిప్రాయాలు వెల్లడైన నేపథ్యంలో అధికారికంగా ఆయన చేరికతో ఊహగానాలకు తెరపడింది.
1982లో కొత్తకోట మండలం కానాయిపల్లి సర్పంచ్గా రావుల రాజకీయ అరంగేట్రం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 1994, 2009లో వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓటమి చెందారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన ఆయన అంతకుముం దు ప్రభుత్వ విప్గా కొనసాగారు. అలా గే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గానూ.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉ న్నారు. ఎట్టకేలకు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు.
ప్రస్తుత మంత్రి నిరంజన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి గతంలో టీడీపీలో కొంతకాలం కలిసి పని చేశారు. నాడు నిరంజన్రెడ్డి ఖాదీ బోర్డు చైర్మన్గా పని చేస్తున్న సమయంలో ఆయనతో సత్సంబంధాలు ఉండేవి. అనంతరం సింగిరెడ్డి తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు. రావుల టీడీపీలో అలాగే కొనసాగుతూ వచ్చారు. సుదీర్ఘకాలం అనంతరం నేడు గులాబీ గూటికి చేరారు. రావుల చేరికతో వనపర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి సైతం ఎన్నికల్లో మరింత బలాన్ని చేకూర్చింది. గతంలో టీడీపీ నేతలంతా బీఆర్ఎస్లో చేరినా.. కొందరు పార్టీని నమ్ముకున్న వారంతా రావుల రాకతో సైకిల్ దిగారు. వీరంతా త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా పనిచేయనున్నా రు. బీఆర్ఎస్ మరింత బలం చేకూరిందని పేర్కొంటున్నారు. ఆ ఆయన చేరిక తో పలువురు నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. రావుల సొంతూరైన కా నాయపల్లి గ్రామంలో 6 వేల జనాభాలో 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 99.9 శాతం ఓటర్లు ఆయన వెంటే ఉండనున్నారు. పార్టీలో చేరిన రావుల చంద్రశేఖర్రెడ్డికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి, జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు.
వనపర్తి,అక్టోబర్ 20 : గత 40 ఏండ్లుగా టీడీపీలో క్రీయాశీలకంగా ఉన్న రావుల చంద్రశేఖర్రెడ్డి బీఆర్ఎస్లో చేరడంపై జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందనలు తెలిపినట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు. రావుల చంద్రశేఖర్రెడ్డి రాకతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా మరింత బలపడునున్నదన్నారు. దీనితో మంత్రి నిరంజన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మెజార్టీ డబుల్ కానున్నదన్నారు.