గట్టు, మార్చి 19 : బలిగేర రైతుబంధు ని ధుల స్వాహా వ్యవహారం ఓ అధికారిపై వేటు కు దారితీసింది. నిధులు స్వాహా జరిగిన స మయంలో గట్టు ఏవోగా పనిచేసిన భాస్కర్రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈయన ప్రస్తుతం మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏఈవోగా ఉద్యోగం పొందిన వనపర్తి జిల్లాకు చెందిన నరేశ్ విద్యార్హత ధ్రువపత్రాలు నకిలీవని పోలీసులు తేల్చినట్లు సమాచారం. ఈయనపై పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, భాస్కర్రెడ్డికి మంచి పేరుంది. అయి తే ఈ వ్యవహారంలో ఈయనను బాధ్యుడిని చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు.