ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే ఎండాకాలంలోనూ తాగునీరు పుష్కలం.. నాడు వాగులు.. వంకల నుంచి తెచ్చుకున్న పరిస్థితులతో దశాబ్దాలుగా తాగునీటికి నలిగిన జనం.. తెలంగాణ ఏర్పడ్డాక మిషన్ భగీరథ శుద్ధ జలాలు ఇంటింటికీ అందుతున్నాయి. డబ్బు పెట్టి కొనాల్సిన మినరల్ నీళ్లు ఇప్పుడు ఇండ్లల్లోని నల్లాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇందుకు కారణం సీఎం కేసీఆర్ రూపొందించిన అద్భుత పథకమే.. నేడు ఈ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. వేసవిలో తాగునీటి ఎద్దడి రావొద్దనే ఉద్దేశంతో కృష్ణానదిలో రివర్స్ పంపింగ్ నిర్వహిస్తున్నారు. కందనూలు జిల్లాలో రూ.2 వేల కోట్లతో పథకం చేపట్టగా.. 750 ఆవాసాల్లో ఆరోగ్య సంజీవనిగా పేరొందింది. నిరంతర నీటి సరఫరా కొనసాగుతుండడంతో నీటి కష్టాలకు చెక్ పడింది.
నాగర్కర్నూల్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు కనీస మౌ లిక సదుపాయాల్లో ప్ర ముఖమైనది తాగునీరు. గతంలో ఈ తాగునీటి కో సం దశాబ్దాల తరబడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడడం చూస్తూనే ఉన్నాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీళ్లు అందించని దుస్థితిలో ఉండేవి. గ తంలో మంచినీళ్ల కోసం నానా కష్టాలు పడేవారు. ముఖ్యం గా ఎండాకాలం వస్తే చాలు మహిళలు ఖాళీ బిందెలతో పం చాయతీలు, మున్సిపల్ కార్యాలయాల వద్ద, రోడ్లపై రాస్తారోకోలు చేపట్టే దుస్థితి ఉండేది. పాలకులు ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సరఫరా చేసే చాలీచాలని నీటికోసం రాత్రింబవళ్లు నిద్ర మాని బిందెలతో నిరీక్షించే పరిస్థితులు అప్పట్లో సర్వసాధారణం. పంచాయతీల ఆధ్వర్యంలో బోర్లు వేయలేక, వేసినా భూగర్భజలాలు లేక నీళ్లు రాకపోవడంతో మంచినీటి సమస్య నిత్యకృత్యంగా ఉండేది. ఇదంతా ఒకప్పుడు..
ఈ పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ లేని శుద్ధ జలాన్ని ఉచితంగా రూ.కోట్లాది నిధులతో అందజేయాలని తలంచారు. ఈక్రమంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఇంటింటికీ ఉచితంగా నల్లా ద్వారా ప్రభుత్వమే నీటిని అందించాలని భావించి మానస పుత్రికగా మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. 2016 ఆగస్టులో ఈ పథకానికి శ్రీకారం చుట్టగా ప్రస్తుతం ఇం టింటికీ శుద్ధజలం ఉచితంగా అందుతున్నది. ఇందుకోసం కృష్ణానదిలోని నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేసి భా రీ ట్యాంకుల ద్వారా గ్రా మాల్లో నిర్మించి ట్యాంకులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి కు ళాయిల ద్వారా ఇంటింటికీ శుద్ధజలం చేరుతున్నది.
పంచాయతీలు, పురపాలికలకు సంబంధం లేకుండా మిషన్ భగీరథ ద్వా రా మంచినీళ్లు అందుతున్నది. దీంతో నాలుగేండ్లుగా ప్రజలకు మంచినీటి సమస్య తీరింది. కాగా మిషన్ భగీరథ నీటిని అధికారులు సంజీవనిగా పేర్కొంటున్నారు. ఇందులో ఖనిజ, లవణాలు సమపాళ్లలో ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎముకల పెరుగుదల సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ఫ్లోరైడ్, మెగ్నీషియం, నైట్రేట్ తగిన మోతాదులో ఉండటం వల్ల జీవక్రియ సాఫీగా జరగడంతోపాటు రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
ఇలాంటి బృహత్తర తాగునీటి పథకంతో నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతోపాటు దాదాపు 750 ఆవాసాలకు శుద్ధజలాలు అందుతున్నాయి. కృష్ణానది జ లాలతో శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరు జలాశయం నుంచి భగీరథకు నీళ్లు అందుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం కల్వకుర్తి, గౌరిదేవిపల్లిలో శుద్ధజల ప్లాం ట్లను ఏర్పాటు చేశారు. మొత్తం మీద దాదాపుగా రూ.2వేల కో ట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోయింది. దీనివల్ల గత నాలుగైదేళ్ల నుంచి తాగునీటి సమస్య తీరింది. ముఖ్యంగా ఎండాకాలంలో గ్రామాలు, పురపాలికల్లో తాగునీటి కోసం పడే ఇబ్బందులను మిషన్ భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ గత చరిత్రలా మార్చివేశారు.
ఇంటి వద్దకే తాగునీరు
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటి వద్దకే తాగునీరు వస్తున్నది. ఈ నీళ్లు రాకముందు మున్సిపాలిటీ బోరు నీళ్లు తాగేవాళ్లం. ఉప్పుగా ఉండి తాగడానికి ఇబ్బంది పడేవాళ్లం. అప్పుడప్పుడూ బాటిళ్లు, బిందెల్లో నీళ్లు కొనుక్కునేటోళ్లం. ఎండాకాలం వస్తే ట్యాంకుల వద్ద, నల్లాల కాడ కొట్లాటలు పడాల్సి వస్తుండె. ఇప్పుడు ఇంటికాడనే కుళాయి బిగించిండ్రు. పొద్దున్నే నల్లా తిప్పి మంచినీళ్లు పట్టుకుంటున్న.
– రాగి ఎల్లమ్మ, గోవిందాయపల్లి
భగీరథ నీటినే తాగాలి
మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఎండాకాలంలో మంచినీళ్ల సమస్య పూర్తిగా తీరిపోయింది. గతంలో ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా శ్రీశైలం రిజర్వాయర్లో రివర్స్ పంపింగ్ ద్వారా కృష్ణానదిలో 3టీఎంసీల నీళ్లను మిషన్ భగీరథకు మళ్లిస్తున్నాం. ఆరోగ్యకరమైన పోషకాలు భగీరథ నీళ్లలో ఉంటాయి. ప్రజలంతా భగీరథ నీటినే తాగాలి.
– శ్రీధర్, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్