గండీడ్/మహ్మదాబాద్, జనవరి 10 : పలెల్లో సేకరిస్తున్న చెత్తతో సంపద సృష్టిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డంపింగ్ యార్డుల్లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణకు శ్రీకారం చుట్టారు. డంపింగ్ యార్డులు నిర్మించారు. ని త్యం ఇంటికి వచ్చి ట్రాక్టర్లతో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఈ వ్యర్థాలను వేరు చేసి డంపింగ్ యార్డుల్లో ఏర్పాటు చేసిన గడుల్లో వేస్తున్నారు. వ్యర్థాలను వృథా చేయకుండా సేంద్రియ ఎరువులు తయరీకి పూనుకున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి గండీడ్ మండల వ్యాప్తంగా దాదాపు 10 క్వింటాళ్ల ఎరువులు తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతుల కు బహు ప్రయోజనాలు చేకూరుతున్నాయి. తయారీ చేసిన ఎరువును రైతులకు విక్రయించడంతో గ్రామ పం చాయతీకి ఆదాయం సమకూరుతున్నది. అంతేకాకుం డా గ్రామంలో చెత్త సేకరిస్తుండడంతో పల్లెలు శుభ్రంగా దర్శనమిస్తున్నాయి. రసాయనిక ఎరువులతో మానవ మనుగడకు ముప్పు ఉందని గ్రహించిన రైతన్నలు సేం ద్రియ ఎరువుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. డంపింగ్ యార్డుల్లోనే స్వచ్ఛమైన ఎరువు తయారీ చే స్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీకి అదనపు ఆదాయం..
డంపింగ్ యార్డుల్లో తయారైన సేంద్రియ ఎరువుల వాడకానికి రైతులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా మంది రైతులు ఎరువును తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంలోగా రైతులకు అందిస్తాం. దీంతో గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం వస్తుంది. రెండు నెలలుగా కంపోస్టు ఎరువు తయారీ చేస్తున్నాం.