మక్తల్ టౌన్, నవంబర్ 25 : నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన కో డింగ్ స్కిల్స్ అందించిన టీటా గ్లో బల్ ప్రెసిడెంట్ జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ మక్తాలకు ప్రశంసలు అందాయి. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డె ల్లాస్ డైరెక్టర్ డాక్టర్ జై వీరస్వామి అ భినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు లేఖ రా శారని జైమక్తల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ నారాయణపేట కలెక్టర్ దాసరి హరిచందన సహకారంతో తెలంగాణ ఎర్లీ కోడర్స్ పేరుతో సందీప్ మక్తాలా అందించిన కోడింగ్ శిక్షణలో నైపుణ్యం పొందిన విద్యార్థులు అవకాశాలు సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. టీటా, జైమక్తల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని 61 పాఠశాలలకు చెందిన 183 మందికి సెప్టెంబర్ 13 నుంచి నాలుగు వారాల పాటు మొదటి దశలో ప్రత్యేక శిక్షణను ఇచ్చినట్లు తెలిపారు. రెండో దశలో భాగంగా అక్టోబర్ 12 నుంచి మొత్తం 2013 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోడింగ్లో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ లాగిన్ పుస్తకాలు అందించినట్లు పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని పాఠశాల విద్యార్థులు ఇక్కడి వారితో మాట్లాడారు. ఎర్లీ కోడర్స్ శిక్షణకు ప్రశంసలు దక్కాయని తెలిపారు.