ఊట్కూర్, ఫిబ్రవరి 9 : ఒకటి కాదు.. రెండు కా దు.. ఏకంగా రెండున్నరేండ్ల నుంచి అధికారుల కళ్లుగ ప్పి ఆసరా పింఛన్ డబ్బులు కాజేసిన పోస్టల్ శాఖ బీ పీఎం అవినీతిని ఎట్టకేలకు అధికారులు బట్ట బయలు చేశారు. చిన్నపొర్లలో వారంరోజుల కిందట ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అవినీతిపై కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పందించి డీఎల్పీవో సుధాకర్రెడ్డిని విచారణ కోసం ఆదేశించారు. ఈమేరకు విచారణ చేపట్టిన అధికారులు గ్రామంలో మొత్తం 41 మంది చనిపోయిన వ్యక్తుల ఐడీ నెంబర్లపై బీపీఎం రుక్కమ్మ కొన్ని నెలలు గా ఆసరా పింఛన్ డబ్బులు కాజేసినట్లు గుర్తించారు.
గ్రామంలో మొత్తం 550 మందికి పింఛన్లు పంపిణీ జరుగుతున్నప్పటికీ వీరిలో 41 మంది చనిపోయిన వారికి సంబంధించిన డబ్బులు రూ.17 లక్షలు స్థానికంగా పని చేస్తున్న జీపీ కార్యదర్శి శివలీల వేలి ముద్ర సాయంతో బీపీఎం స్వాహా చేసినట్లు అధికారులు విచారణలో నిర్ధారించారు. ఈ విషయం విచారణ కోసం అధికారులు ఇండ్ల వద్దకు వచ్చేంత వరకు తెలియదని పలువురు గ్రామస్థులు తెలిపారు. ఎంపీడీవో కాళప్ప మాట్లాడుతూ ఆసరా నిధుల దుర్వినియోగంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణను పూర్తి చేశామని, కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పోస్టల్ బీపీఎంతో పాటు పంచాయతీ కార్యదర్శిపై చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
వెలుగులోకి ఇలా..
పింఛన్ పొందుతూ కుటుంబ యజమాని చనిపోతే వారి స్థానంలో భార్యకు వితంతు పింఛన్ అందించేందుకు ప్రభుత్వం ఇటీవల జీవోను విడుదల చేసింది. ఏ కారణంతోనైనా సరే కుటుంబ యజమాని మరణిస్తే జీ వో నంబర్ 31లో భాగంగా 15 రోజుల్లో భార్యకు వి తంతు పింఛన్ అందించాలని పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. చిన్నపొర్లకు చెందిన ప లువురు మహిళలు వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. చనిపోయిన తమ భర్తల స్థానంలో కొ త్తగా తమకు వితంతు పింఛన్ మంజూరీ చేయాలని జీ పీ కార్యదర్శిని కోరారు. విచారణ నిమిత్తం రికార్డులను పరిశీలించిన అధికారికి అసలు విషయం తెలిసింది. ఈ ఘటనతో అన్ని గ్రామాల్లో పింఛన్ పొందుతూ చనిపోయిన వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ప్రయ త్నం మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.