మహబూబ్నగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలమూరులో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు చేపడుతున్న యాత్రలు ఆ పార్టీల్లో కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దలను సంప్రదించకుండా యాత్రలు చేపడుతుండడంతో లోలోపలే లుకలుకలు మొదలయ్యాయి. యాత్రకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఏకంగా సీఎం సోదరుడే రంగంలోకి దిగడంతో ఆ పార్టీ నేతలు షాక్కు గురయ్యారు. చివరకు యూటర్న్ తీసుకున్నారు. పార్లమెంట్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన మరో నేత పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర తొలిరోజే తుస్సుమన్నది. ఇద్దరు కేంద్ర మంత్రులు, అరడజను రాష్ట్ర నాయకులు వచ్చినా కా ర్యకర్తల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆ పార్టీ కేంద్ర మంత్రి ఒకరు మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యకర్తలు లేక సంకల్పయాత్ర వెలవెలబోయింది. రాష్ట్రంలో అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను గాలికొదిలేసి యాత్రలు చేపట్టడం ఏమిటని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటు బీజేపీ కూడా సమస్యలపై నిలదీసేదిపోయి అధికార పార్టీకి వత్తాసు పలుకుతుందని దుయ్యబడుతున్నారు. యాత్రలకు ఇటు కా ర్యకర్తలనుంచి అటు ప్రజల నుంచి స్పందన కరువవడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు కంగుతింటున్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ఆ పార్టీలో విబేధాలను సృష్టిస్తున్నది. పార్టీ పెద్దలను సంప్రదించకుండా ఏకపక్షంగా న్యాయ యాత్రను జనవరి 31న నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. యాత్ర ప్రారంభమయ్యాక పార్టీలోని నేతలు ఒక్కొక్కరు తమ అసంతృప్తి గళాన్ని వినిపించారు. హైటెక్ హంగులతో చేపట్టిన యా త్రకు ఆయన భారీ పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. పార్లమెం ట్ పరిధిలో ఎమ్మెల్యేల ఫొటోలు పెట్టి భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేపట్టారు. దీంతో కంగుతిన్న కాంగ్రెస్లోని మరో వర్గం ఏకంగా సీఎం సోదరుడిని రంగంలోకి దింపింది. దీంతో తిరుపతన్న మిత్రమండలి పేరుతో రాత్రికిరాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. అనంతరం నాలుగైదు గంటల్లో మున్సిపల్ అధికారులతో తీ యించేశారు. తిరుపతిరెడ్డి ఫ్లెక్సీలు వెలియడంతో వం శీచంద్రెడ్డి యాత్రకు బ్రేక్ ఇచ్చి పార్టీ ఎవరికి టికెట్ ఇ చ్చినా అందరం కలిసి పనిచేస్తామని ప్రకటించే వరకు వెళ్లింది. ఈ వివాదం జరుగుతుండగానే జిల్లాకు చెం ది న పారిశ్రామికవేత్త ఒకరు చార్టెడ్ ఫ్ల్లైట్లో 40, 50 మం ది నాయకులను వెంటేసుకుని ఢిల్లీలో హడావుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక పార్లమెంట్ టికెట్ తనదేనంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో కంగుతిన్న వంశీచంద్ యాత్రకు రాష్ట్ర పెద్దలను ఆహ్వానించేవరకు వెళ్లింది. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో వంశీయాత్రపై సీఎం ఆగ్రహమై తన అనుమతి లేకుం డా ఎలాంటి యాత్రలు చేపట్టరాదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో యాత్రకు బ్రేక్పడేలా ఉన్నది. ఇప్పటికే ఎంపీ టికెట్ కోసం వంశీచంద్రెడ్డి, సీఎం సోదరు డు తిరుపతిరెడ్డి, నవాబుపేట మండలం గురుకుంటకు చెందిన మన్నె జీవన్రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వి జయ సంకల్పయాత్ర పేరిట జనం ముందుకు వచ్చి షో చేస్తున్నది. ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విజయ సం కల్పయాత్రకు తొలిరోజే షాక్ తగిలింది. అనుకున్న స్థాయిలో కార్యకర్తలను తరలించడంలో ఆ పార్టీ నేత లు విఫలమయ్యారు. ఎంపీ టికెట్ కోసం పార్టీలో రచ్చ జరుగుతున్నది. డీకే అరుణ పెత్తనం చలాయిస్తుండడంతో జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి అనుచరుడు జలంధర్రెడ్డి సైలెంట్ అయిపోయారు. దీంతో జనాన్ని తరలించడంతో డీకే అరుణవర్గం అట్టర్ ఫ్లాప్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కేంద్రమంత్రులు వచ్చినా.. మక్తల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ తుస్సుమనడంతో ఒక కేంద్ర మంత్రి తన షెడ్యూల్ను మార్చుకొని ఢిల్లీకి జంప్ అయ్యారు. యాత్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇలా అయితే పార్లమెంట్ స్థానం ఎలా కైవసం చేసుకుంటామని క్లాస్ తీసుకున్నారు.
ప్రజలు కరెంట్, తాగునీరు, పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు యాత్రల పేరిట కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతున్నది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అ ప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరును ఎడారిగా మార్చిందని, నీళ్లు లేక ప్రాజెక్టులు ఒట్టిపోయి పంటలు ఎండిపోతుంటే బీజేపీ, కాంగ్రెస్ యాత్రలు చేయడం సిగ్గుచేటని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే రైతుబంధు రాక రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు తెచ్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు. వంద రోజుల్లో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చె ప్పి ఒక్క గ్యారెంటీ అమలు చేసి ఆటోడ్రైవర్లను రోడ్డున పడేసిందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్, బీజేపీ నేతలు యాత్రలు నిలిపివేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హా మీల అమలుపై బీజేపీ పట్టించుకోకుండా ఆ పార్టీకి వ త్తాసు పలుకడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.