మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 15 : అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవ లు అందించేందుకు పోలీసు వాహనాలు కండీషన్లో ఉండాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలో గురువా రం పోలీసు వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు వా హనాలకు పెయింటింగ్, డెంటింగ్, అత్యవసర హారన్, పోలీసు స్టిక్కర్ వేసి కొత్తరూపు తెస్తున్నట్లు తెలిపారు. పోలీసు విధినిర్వహణలో వ్యక్తిగత ఆరోగ్యం, శారీరక పటుత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రధానమైన ఆయుధా లు, వాహనాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం పోలీసుశాఖకు అందించిన నూతన వాహనాలతో అ త్యవసర పరిస్థితుల్లో ప్రజల సేవకు సౌకర్యవంతంగా ఉందన్నారు. వృత్తిలో ఎంతగానో సహకరించే వాహనాలను విలువైన ఆస్తిగా భావిస్తున్నట్లు తెలిపారు. వాహనాలను శుభ్రంగా, కండీషన్లో ఉంచుకోవడంలో డ్రై వర్లు, మెకానిక్లు శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. మొత్తం 35 వాహనాల ఆధునీకరణకు పోలీసు మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం శ్రద్ధ చూపడంపై అభినందించారు. మున్ముందు కూడా వాహనాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంటీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేసుల పరిష్కారానికి చర్యలు : డీఎస్పీ
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకొని న్యాయం జరిగేలా చర్య లు తీసుకుంటున్నట్లు డీఎస్పీ మహేశ్ పేర్కొన్నారు. నవాబ్పేట పోలీస్స్టేషన్ను గురువా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల కు సంబంధించిన రికార్డులను పరిశీలించా రు. అనంతరం మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదునూ ఆన్లైన్లో న మోదు చేయాలని సూచించారు. రోజూ వా హనాల తనిఖీ చేపట్టాలని, డ్రంకెన్డ్రైవ్ తనిఖీ నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమం లో సీఐలు రాజేశ్వర్గౌడ్, ప్రవీణ్కుమార్, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు.