మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 15 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ ముగియగా.. గురువారం పురుష అభ్యర్థులకు పరీక్షలు మొదలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు మైదానానికి చేరుకోగా.. 5 గంటలకు ప్రక్రియ మొదలైంది. ముందుగా అభ్యర్థుల అడ్మిట్ కార్డులు, సర్టిఫికెట్లను పోలీస్ అధికారులు పరిశీలించారు. అనంతరం 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. అభ్యర్థులు గ్రౌం డ్లోకి వచ్చాక వారి ప్రతి కదలిక కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. 959 మంది అ భ్యర్థులకుగానూ 789 మంది హాజరయ్యారు. వీరిలో 590 మంది ఈవెంట్స్ పూర్తిచేసి తర్వాత పరీక్షకు అర్హత సాధించారు. ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఎస్పీలు వెంకటేశ్వర్లు, చేతన ఈవెంట్లను పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదన్నారు. నోడల్ ఆఫీసర్గా ఏఎస్పీ రాములు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం ఏవో కృష్ణయ్య, డీపీవో సిబ్బంది, అధికారులు అభ్యర్థులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.