కోరుట్ల, జనవరి 16: కోరుట్ల పట్టణంలోని తాండ్య్రియాల ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. డబ్బులు కాజేసి పారిపోతుండగా, పోలీసులు పక్కా సమాచారంతో స్పాట్ చేరుకొని అడ్డగించారు. దీంతో డబ్బుల బాక్స్లను అక్కడే పడేసి దొంగలు పరారైన తీరు ఉత్కంఠ రేపింది.
గ్యాస్ కట్టర్తో ఏటీఎం కటింగ్
పట్టణంలోని కోరుట్ల – వేములవాడ రోడ్డు లో ఉన్న తాండ్య్రియాల్ బ్రాంచ్ ఎస్బీఐ బ్యాం కు ఏటీఎంలోకి ఆదివారం అర్ధరాత్రి 1.15 గంటలకు దొంగలు చొరబడ్డారు. ముందుగా ఏటీఎం షటర్ను మూసి వేసి సీసీ కెమెరాలపై స్ప్రే చల్లారు. తమతో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ను తెరిచిన దొంగలు అందులో 5 బాక్స్ల్లో అమర్చిన డబ్బులను దొంగిలించారు.
సినిమా సీన్ను తలపించేలా పోలీసుల ఎంట్రీ..
దొంగలు ఏటీఎం తెరిచే సమయంలో హైదరాబాద్లోని బ్యాంకు సర్వేయల్ టీమ్కు వా ర్నింగ్ సిగ్నల్స్ అందగా, వెంటనే కోరుట్ల ఎస్ఐ సతీశ్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఎస్ఐ వెంటనే పెట్రోలింగ్ టీంకు విషయాన్ని వివరించగా, అప్పటికే అయిలాపూర్లో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది కేవలం ఎనిమిది నిమిషాల్లోనే జెట్ స్పీడ్తో స్పాట్కు చేరుకున్నారు. అప్పటికే ఓ దొంగ బయట గస్తీ తిరుగుతుండగా, ఇద్దరు దొంగలు ఏటీఎం మిషన్లో ఉన్న డబ్బుల బాక్స్లను బయటకు తెస్తున్నా రు.
పోలీస్ సైరన్ విన్న ఆ దొంగలు ఆందోళనతో తమ బ్రీజా వాహనంలో వెనుక డోర్ ద్వారా డ బ్బుల బాక్స్లను లోపలపెట్టే ప్రయ త్నం చే యగా, శరవేగంగా అక్కడికి చేరుకున్న పోలీస్ జీపు దొంగల వాహనాన్ని వెనుక నుంచి బలం గా ఢీకొట్టింది. దీంతో బండిలో వెనుక వైపు కూర్చున్న దొంగతో సహా వెనుక పెట్టిన డబ్బుల బాక్స్లు రోడ్డుపై పడిపోయాయి. వెంటనే తేరుకున్న దొంగ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించ గా, పోలీసులు దొంగ చొక్కా పట్టుకుని కిందకు లా గగా, మరో దొంగ సాయంతో లోపలికి ఎక్కాడు.
రోడ్డుపై చెల్లాచెదురుగా నగదు..
పోలీసులు చేజ్ చేస్తుండగా తమ వాహనాన్ని స్పీడుగా నడిపిన దొంగలు స్థానిక సివిల్ హాస్పిటల్ దాకా వెళ్లారు. అటు దారి లేక పోవడంతో వెనక్కి మళ్లారు. వాహనాన్ని ఆపేందుకు య త్నించిన పోలీసులపైకి తమ కారును ఎక్కించేందుకు యత్నించగా, పోలీసులు పక్కకు జరిగా రు. ఈ క్రమంలో రోడ్డుపై పడ్డ డబ్బు బాక్సుల పైనుంచి వాహనం వెళ్లిపోవడంతో సుమారు రూ.3 లక్షల నగదు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. ఏటీఎం నుంచి దొంగిలించిన 5 డ బ్బు పెట్టెల్లో నాలుగింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో ఖాళీ బాక్సును దొంగలు ఎత్తుకెళ్లారు. మొత్తంగా ఏటీఎంలో ఉన్న 19 లక్షల 200 కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ దొంగతనం జరిగిన ఏటీఎంను పరిశీలించారు. చోరీ జరిగిన తీరును తెలుసుకున్నారు. మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దొం గల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వివరించారు. నలుగురు సభ్యుల దొంగల ముఠా దొంగతనానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, దొంగల వాహనం మల్లాపూర్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
సోషల్ మీడియాలో చేజింగ్ దృశ్యాలు
చాకచక్యంగా వ్యవహరించి దొంగల నుంచి బ్యాంకు సొమ్మును కాపాడిన పెట్రోలింగ్ పోలీసులను ఎస్పీ సింధూశర్మ అభినందించారు. తక్షణమే స్పందించి ఏటీఎం డబ్బులను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ మేడి రాజయ్య, కానిస్టేబుల్ గట్టు శ్రీనివాస్, డ్రైవర్ మధును ఎస్పీ మెచ్చుకున్నారు. అలాగే ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల సమయస్ఫూర్తికి పట్టణవాసులు ఫిదా అవుతున్నారు. సమాచారం వచ్చిన కేవ లం ఎనిమిది నిమిషాల్లో స్పాట్కు చేరుకోవడం, దొంగల కారును వెనుక నుంచి ఢీ కొట్టడం, దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు చూ పిన పోరాట పటిమ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో చేజింగ్ దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులపై పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వాహనం వెనకాల పరిగెత్తి..
చోరీ సొత్తుతో పారిపోతున్న దొంగలను పట్టుకునేందుకు కానిస్టేబుల్ శ్రీనివాస్, డ్రైవర్ మధు తీవ్రంగా శ్రమించారు. వాహనం వెనుక కూర్చు న్న దొంగను చొక్కా పట్టుకొని కిందకు లాగడం తో డబ్బుల బాక్స్ల సహా దొంగ కూడా కింద పడ్డాడు. మరో నిందితుడి సాయంతో లోపలికి ఎక్కాడు. ఈ క్రమంలో దొంగలు వాహనాన్ని స్పీడ్గా నడిపి పోలీసులపైకి ఎక్కించే యత్నం చేయగా, పక్కకు తప్పుకుపోవడంతో ప్రమాదం తప్పింది.