నారాయణపేట : జిల్లాలోని మరికల్ మండల ( Marikal ) కేంద్రంలోని సర్వేనెంబర్ 669, 672లో ఉన్న ప్లాట్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టనున్న భారతమాల రోడ్డు ( Bharatmala road ) పనులను ప్లాట్ల యజమానులు ( Plot owners ) అడ్డుకున్నారు. ప్లాట్ల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుండానే పనులు చేపట్టడంతో గురువారం ప్లాట్ల యజమానులు రోడ్డుపైకి వచ్చి పనులను నిలిపివేయించారు.
నష్టపరిహారం కోసం ఆర్డీవో కార్యాలయంలో చుట్టూ తిరిగినా స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చుపెట్టి ప్లాట్లు కొన్న తమకు నష్టపరిహారం అందజేసినా తరువాతే ప్రభుత్వం పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు .