అచ్చంపేట, సెప్టెంబర్ 2: గత ప్రభుత్వాల హయాంలో అంగన్వాడీలు అంటే చిన్నచూపు ఉండేదని, స్వరాష్ట్రంలో అంగన్వాడీల పనితీరు మెరుగుపడిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం అచ్చంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీడీపీవో దమయంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విప్ గువ్వల మాట్లాడారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీలను పట్టించుకోలేదని, సెంటర్లకు వచ్చిన సరుకులు ఎక్కడికెళ్తున్నాయో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారించి అనేక మార్పులు తెచ్చారన్నారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచడం, సకాలంలో పౌష్టికాహారం అందజేయడం, గర్భిణులు, బాలింతలు, పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అంగన్వాడీలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఐసీడీఎస్, మున్సిపల్శాఖ కలిసి రూప్ గార్డెన్ నిర్మాణాలు ప్రణాళికాబద్దంగా చేపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. క్యాంపు కార్యాల యంలో అవకాశం ఉంటే రూప్గార్డెన్ ఏర్పాటు చే యడం వల్ల తనను కలిసేందుకు వచ్చే ప్రజలు రూప్గార్డెన్ చూసి ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. అ నంతరం ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, సర్పంచ్ లోక్యనాయ క్, జెడ్పీటీసీ రాంబాబు, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు శ్రీను, శివ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.