నాగర్కర్నూల్, డిసెంబర్ 6 : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, నాగర్కర్నూల్ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఎవరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా కల్పించారు. నాగర్కర్నూల్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా ఉంటానని, తన ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలైన మర్రి అన్న క్యాంటిన్, పెండ్లిళ్లు కానీ ఇంకా సేవా కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తామని ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మర్రి మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి నాగర్కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నియోజకవర్గంలోని ఏ మండలంలో ఏ ప్రాంతానికి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటి పై దృష్టి పెట్టి పనుల పూర్తి చేశామన్నారు.
రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చామని, కానీ ఈసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, వారి తీర్పునకు కట్టుబడి కొత్త ప్రభుత్వానికి స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని దానిని పూర్తి గా అంగీకరిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగర్కర్నూల్ను జిల్లాగా ఏర్పా టు చేసి ప్రజలకు పరిపాలన చేరువ చేశామన్నారు. విద్య పరంగా మెడికల్ కళాశాల తీసుకువచ్చినట్లు చెప్పారు. పేదవారికి పెండ్లిళ్లు చేయడం, ఇరిగేషన్ ద్వారా రైతులకు నీటి సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వంలో చేసి ప్రజలకు చేరువయ్యామన్నారు. ఇంకా కొన్ని పనులు మిగిలి పోయాయని, వీటి లో ఇంజినీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు సైతం 90 శా తం పూర్తయ్యిందన్నారు. నాగర్కర్నూల్ ప్రాంతానికి ఇప్పటికే లక్షా 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించామని, తిమ్మాజిపేట మండలానికి 40 నుంచి 50వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉందన్నారు.
ఇందుకోసం నిరంతరం శ్రమించామని, ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొన్నామన్నారు. ఏది ఏమై నా సరే ప్రతిపక్షంలో ఉన్నా పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసి నియోజకవర్గంలోని లక్షా 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంలో తాను భాగస్వామిని అవుతానన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, ఎమ్మెల్యేలు సైతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గెలుపొందిన వారు పూర్తి అవగాహనకు వచ్చి అభివృద్ధిని కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని, ఆపే ప్రసక్తే లేదన్నారు. పదవులు వస్తూపోతూ ఉంటాయని, సేవ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. మానవ సేవయే మాధవసేవ అనే నినాదంతో చేపట్టిన సేవా కార్యక్రమాలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కొనసాగిస్తానన్నారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జకా రఘునందన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్యాదవ్, పార్టీ నాయకులు నాగం శశిధర్రెడ్డి, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, ఎంపీపీలు న ర్సింహారెడ్డి, మధు, నాగర్కర్నూల్ ము న్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ కుర్మ య్య, అర్థం రవి, పాండుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.