కోస్గి, నవంబర్ 7 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్లి వివరించాలని మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కోస్గి పట్టణంలోని పౌమ్హౌజ్లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలో ఏరాష్ట్రంలో జరగలేద న్నారు. కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ పథకాల ను ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియో జకవర్గాన్ని అని విధాలా అభివృద్ధ్ది చేశారన్నారు. అభివృద్ధిని చూసి కొడంగల్నియోజకవర్గ ప్రజలు ఆయన మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు.
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ సోమ వారం కొడంగల్లో రేవంత్రెడ్డి మట్లాడిన మాటలు పచ్చి అబద్దాలన్నారు. పదేండ్లుగా కొడంగల్లో తిరగని ఆయ నకు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంతెలుసన్నారు. దౌల్దాబాద్లో జూనియఆర్ కాలేజీ ప్రారంభమైన సంగతే ఆయనకు తెలువదన్నారు. మహబూబ్నగర్- చించోలి హైవే పనులు ప్రాంభమై పూర్తి దశకు చేరున్నాయన్నారు. రేవంత్రెడ్డి చెప్పే అబద్దాలు కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కొడంగల్లో నామినేషన్ వేసి పోతా ను కార్యకర్తలే గెలిపంచాలని చెప్పారన్నారు. ఓటు అడి గేందుకు ప్రజల వద్దకు రానోడికి వారి సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర పడొద్దని నామినేషన్ వేశాక పూర్తి స్థా యిలో ఇన్చార్జీలు అందుబాటులో ఉండి అన్ని సహా య సహకారాలందిస్తారన్నారు. ఈనెల 9న మంత్రి కేటీఆర్ కొడంగల్కు వస్తున్న సందర్భంగా కొన్ని ప్రతి పాదనలు ఆయన ముందుకు తీసుకెళ్తామన్నారు. అందులో మద్దూ ర్ను మున్సిపాలిటీ, కోస్గిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతామన్నారు. చంద్రకల్ వద్ద స్థలం చూసి పెట్టాం కొత్త ఐటీ కంపెనీలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
అంతకు ముందు గ్రథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ జక్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా కేక్ కట్చేసి మంత్రి, ఎమ్మెల్యే స్థానిక నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథార్టీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఈజీఎస్ స్టేట్ డైరక్టర్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేణుగోపాల్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీను, బాలేశ్, జనార్ధన్ రెడ్డి, బందెప్ప, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మ్యకల రాజేశ్, నాయకులు ఓప్రకాశ్, వర ప్రసాద్, వెంకట్నర్సింహులు, రాజేందర్రెడ్డి, అమృ తమ్మ దితరులు పాల్గ్గొన్నారు.