కోస్గి, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పతనం తన సొంత నియో జకవర్గం కొడంగల్ నియోజకవర్గం కోస్గి నుంచే ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కోస్గి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సీఎం అయ్యాకా ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను, రైతులను మోసం చేశాడని ఆరోపించారు. అనంతరం మండల పరిధిలోని పీసీ తండాకు చెందిన శ్రీను నాయక్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పట్నం సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.