కొల్లా పూర్, డిసెం బర్ 19 : ఆర్టీసీ బస్సులో విలువైన వస్తువులు, నగదు ఉన్న హ్యాండ్ బ్యా గ్ను మరిచిపోయి వెళ్లిన ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. వివరాలు ఇలా.. 17వ తేదీన మధాహ్నం 2:30 గంటలకు ఏపీ లోని తిరుపతిలో బయలు దేరిన కొల్లా పూర్ డిపోకు చెందిన డీలక్స్ (38 జెడ్ 0004)లో అనంతపురం జిల్లా కదిరి పట్ట ణా నికి చెందిన రెడ్డి నాథ్, లక్ష్మీ దేవి దంప తులు ప్రయాణించారు. అయితే అర్ధ రాత్రి 12 గంటల సమ యంలో కర్నూల్ బస్టాం డ్లో లక్ష్మీ దేవి హ్యాండ్ బ్యాగ్ను మరి చి పోయి బస్ దిగిపోయారు. కొద్ది సేపటికే తేరుకొని ఆందోళన చెందారు. గూగుల్ సర్చ్ లోకి వెళ్లి కొల్లాపూర్ డిపోకు సంబం ధించి తిరుపతి నుంచి బయలు దేరిన బస్సు వివరాలు, ప్రకటన ఫ్లెక్సీపై ఉన్న ఏడీసీ ఖాజా మై నొ ద్దీన్ సెల్ నెంబర్ ఉండడం తో వారు సంప్రదించారు.
వెంటనే ఆయన బస్సు డ్రైవర్లుగా ఉన్న ఎం.కృష్ణ, రాజుకు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. వారు హ్యాండ్ బ్యాగ్ను బస్సులో గుర్తిం చారు. అందులో ఒక టి న్నర తులం బంగారు గొలుసు, రూ.8 వేల ఫోన్, రూ.5,100లు నగదు, బైక్ ఆర్సీ, 6 ఏటీఎం కార్డులు, పాన్ కార్డు, పూసల దండలు ఉన్నట్లు గుర్తిం చారు. కొల్లా పూర్ డిపోకు చేరు కున్న తర్వాత బస్సు డ్రైవరుల సెక్యూరిటీ గార్డుకు బ్యాగ్ అప్పగించారు. సదరు దంప తు లకు ఫోన్లో సమా చారం అందిం చగా మంగ ళ వారం వారు డిపోకు చేరు కోగా హ్యాండ్ బ్యాగ్, అందులోని వస్తు వు లను డీఎం ఉమా శంకర్, ఏడీసీ ఖాజా మై నొ ద్దీన్, అసి స్టెంట్ డీఎం బాల స ర స్వతి, డ్రైవర్ల సమ క్షంలో అప్ప గిం చారు. అనం తరం విధి నిర్వ హ ణలో ఉండి బ్యాగ్ను భద్ర ప ర్చిన డ్రైవర్లు కృష్ణ, రాజుకు శాలు వాలు కప్పి అధి కా రులు సన్మా నిం చారు. వారి నిజాయితీని తోటి ఉద్యోగులు అభినందించారు.