గోపాల్పేట, మార్చి 11 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని పద్మావతీ గార్డెన్స్లో గోపాల్పేట, రేవల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల్లో అ భ్యర్థుల విజయానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అధికారం చేపట్టిన నెల వ్యవధిలోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. కాం గ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేదని, ఇచ్చిన హామీలను నిలుపుకోలేకపోయిందని విమర్శించారు. సాగునీరు, కరెంటు ఇవ్వకపోవడం వల్లే రైతులు పంటలను మూగజీవులకు మేతగా వేసే దు స్థితి దాపురించిందన్నారు. యాసంగి చివరి పంట కు నీళ్లు ఇచ్చిన ఘనత, అభివృద్ధిలో తెలంగాణను ప్రపంచపటంలో నిలిపిన నాయకుడు కేసీఆరేనని కొనియాడారు. విస్తృత ప్రయోజనాల కోసమే బీఎ స్పీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. పార్టీకి ద్రో హం చేసిన వారిని క్షమించే ప్రసక్తేలేదని స్పష్టం చే శారు. ఆ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే నమ్మకం లేదని, గతంలో తాము మంజూరు చేసిన అభివృద్ధి పనులను కొనసాగించేలా డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు నాగం తిరుపతిరెడ్డి, కురుమూర్తియాదవ్, తిరుపతియాదవ్, ఎంపీపీ సేనాపతి, వైస్ఎంపీపీ చంద్రశేఖర్, మధుసూదన్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, సింగిల్విండో వైస్చైర్మన్ రాములు, కోఆప్షన్ సభ్యులు మతీన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘురామారావు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పెబ్బేరు, మార్చి 11 : నెల రోజుల వ్యవధిలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకతను చవి చూసిన ప్రభుత్వా న్ని తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పెబ్బేరులోని సహారా ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మండలస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాం గ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు. రైతుబం ధు, రుణమాఫీ పథకాల ఊసే ఎత్తకపోవడంతో అన్నదాతల ఆశలు కల్లలయ్యాయని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణలో విఫలమై రైతులకు సాగునీటిని సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హ యాంలో రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ని త్యం ప్రజల మేలు కోరుతుందని, కార్యకర్తలు, నా యకులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి నియోజవకర్గంలో అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్కు ఓటేసిన వారంతా ప్రస్తుతం పశ్చాత్తాపపడుతున్నారన్నారు. రానున్న ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్చైర్మన్ కర్రెస్వామి, శ్రీరంగాపురం సింగిల్విండో అధ్యక్షుడు జగన్నాథం, పెబ్బేరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వనం రాములు, పట్టణ అధ్యక్షుడు దిలీప్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.