వనపర్తి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీఎస్పీ చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో బీఎస్పీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.మహేశ్, అసెంబ్లీ అధ్యక్షుడు గంధం వంశీ, వనపర్తి పట్టణ అధ్యక్షుడు కె.గౌతం, పెబ్బేరు మండల కోశాధికారి గంధం రాంచందర్, సోషల్ మీడియా ఇన్చార్జి గుడిసె వేణు, గట్టు బాలకృష్ణ, కార్తీక్, కు మార్, నర్సింహ తదితరులు ఉన్నారు.