మహబూబ్నగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ల ను దశల వారీగా ఈసీ నిర్వహించనున్నది. ఇందు లో భాగంగా 4వ విడుతలో తెలంగాణలో జరగనున్నాయి. గురువారం ఎంపీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లో రెండు లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ స్థానం జనరల్కు కేటాయించగా.. నాగర్కర్నూల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు పోలింగ్ ప్రక్రియకు సం బంధించి అధికార యంత్రాంగం ఆయా రిటర్నిం గ్ అధికారుల ఆదేశాలతో సన్నద్ధమవుతున్నది. షె డ్యూల్ విడుదల కాగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అమలు పర్చుతున్నది. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి ఆయా పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశించే చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. మరోవైపు రాజకీయ పక్షాలు కూడా ఈ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.
రెండు లోక్సభ సెగ్మెంట్లకు సం బంధించి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రాగానే నామినేషన్ల పర్వం ప్రా రంభం కానున్నది. దీనికి సంబంధించి ఆయా పా ర్టీలు కదన రంగంలోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉన్న ది. అయితే ఎవరు గెలుస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 21 (ఆదివారం) మినహాయించి, మిగతా 7 రోజులు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ చాంబర్లో రిటర్నిం గ్ అధికారికి నామినేషన్లు అందజేయాల్సి ఉంటుంది. నా మినేషన్లు వేసే సమయంలో అభ్యర్థికి సంబంధించి మూ డు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.. రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతినిస్తారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒక ప్రపోజర్, గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులకు 10 మంది ప్రపోజర్లు ఉండాలి. ప్రపోజర్లు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటుహ క్కు కలిగి ఉండాలి. 26న స్క్రూట్నీ, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అభ్యర్థులకు కలెక్టరేట్లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, లేటెస్ట్ నామినేషన్ పత్రం ప్రింట్, అఫిడవిట్ పత్రాలను అందుబాటులో ఉంచారు. నా మినేషన్ ఫారం-2ఏ లో, అఫిడవిట్ ఫారం-26లో అందజేయాల్సి ఉంటుంది.
అన్ని రకాల అనుమతుల కోసం సువిధ యాప్ లో దరఖాస్తును 48 గంటల ముందుగా చేయాలి. నామినేషన్ స్వీకరణ చెక్ లిస్ట్ అందజేసి, దాని ప్ర కారం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి, కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు పాటించాలి.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 85 ఏం డ్లు పైబడిన వృద్ధులు, పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని ఈసీ కల్పించింది. హోం ఓటింగ్ రూట్, గ్రామం వారీగా టీంలను ఏర్పాటు చేసి పారదర్శకంగా పోస్టల్ బ్యా లెట్ జారీ చేసీ, రాజకీయ పార్టీలకు సమాచారం అందిస్తారు. సాక్ష్యం యాప్ ద్వారా వీల్ చైర్లు, వ లంటీర్లను ఏర్పాటు చేస్తారు. సాక్ష్యం యాప్పై అవగాహన కలిగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సీ-విజిల్ యాప్లో డబ్బు, మద్యం, ఉచిత వ స్తువుల పంపిణీపై పౌరులు ఫిర్యాదు చేయొచ్చు. ఫి ర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతారు. ఈ యాప్లో గనుక ఫిర్యాదు చేస్తే జిల్లా యంత్రాం గం వెంటనే స్పందించి దానిపై పూర్తిస్థాయిలో చర్య లు తీసుకుంటుంది. ఇక పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, ర్యాం పులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక ప్రతి అసెం బ్లీ నియోజవర్గంలో మహిళలతో నిర్వహించే 5 పో లింగ్, మోడల్ పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులు, యువతతో నిర్వహించేలా.. పోలింగ్ కేంద్రాలను ఒ క్కోటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.