పరిగి, నవంబర్ 2: తొమ్మిది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ అనునిత్యం ప్రజల్లోనే ఉండాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ కమిటీ కన్వీనర్లకు సూచించారు. గురువారం పరిగిలో జరిగిన మం డలంలోని బీఆర్ఎస్ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు సదుపా యం, తండాలకు బీటీ రోడ్లు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాలతోపాటు పట్టణాల స్వరూపం మారిపోయిందన్నారు. ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించ డం ద్వారా పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకురావాలని చెప్పారు. తటస్థులు సైతం నేడు బీఆర్ఎస్ వైపు నిలుస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను క్షేత్ర స్థాయిలోనే తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పనిసరిగా సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత నాలుగు దశా బ్దాలుగా తమ కుటుంబంతోపాటు సాగుతున్న వారంతా మా కుటుంబసభ్యులేనని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, జెడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.
ప్రజాసేవ చేసేందుకు మరొక అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కోరారు. గురువారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించడం ద్వారా అయిదేండ్లలో పరిగి పట్టణం లోని అన్ని వార్డులను అభివృద్ధి చేశామన్నారు. తొమ్మిదో వార్డులోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. ఈసారి రెండవ పర్యాయం తనన గెలిపించాలని, తద్వారా పరిగి అభివృద్ధికి సహకరించాలని కోరారు. విద్యారణ్యపురికి రోడ్డు సదుపా యంతోపాటు వాగుపై వంతెన నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్, కౌన్సిలర్లు వారాల రవీంద్ర, వెంకటేశ్, నాగేశ్వర్, ఎదిరె కృష్ణ, మునీర్, బీఆర్ఎస్ నాయకులు ఆకారపు రాజు, అశోక్, ప్రవీణ్, మేడిగడ్డ శ్రీనివాస్, సమద్, తాహెర్అలీ, నయీమ్, బషీర్, సేవ్యానాయక్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.