పాలమూరు,డిసెంబర్ 14 : పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో మంగ ళవారం నుంచి యూజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ఐదో సెమిస్టర్ పరీక్షలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రం కొత్త సిలబస్ ప్రకారం కాకుండా పాత సిలబస్ పేపర్లు పరీ క్ష హాల్లోని విద్యార్థులకు అందజేశారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా కంగుతిని ఆందోళన గురయ్యారు. పరీక్ష 9:30గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షను 45నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. జరిగిన అవకతవకలను పీయూ ఇన్చార్టి పరీక్షల నియంత్రణ అధికారిణి డా.శాంతిప్రియ ఏమి జరగలేదని క ప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి తప్పులు జరగడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై వారి భవిష్యత్పై ప్రభావం చూపుతుందని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధులపై నిర్లక్ష్యంపై వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తలిదండ్రులు డిమాండ్ చేశారు.