నాగర్కర్నూల్, ఫిబ్రవరి 9 : ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైనదని, బస్సుల్లో ప్రయాణించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య కోరారు. గురువారం నాగర్కర్నూల్ బస్టాండ్లో తన పాటతో ప్రయాణం గురించి అలరింపజేశారు. సురక్షిమైన ప్రయాణం పొందాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటూ సూచనలు చే శారు. సమయపాలనలో నడిచే బస్సుల్లో రాకపోకలు సాగించి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రభుత్వ హయాంలో వికలాంగులకు, విద్యార్థులకు, కళాకారులకు, సమరయోధులకు ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
ఆర్టీసీని లాభాల బాటలో చూడగలుగుతామని పాటలతో వివరించడం ఆకట్టుకుంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచన మేరకు ప్రయాణికులను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని తెలకపల్లి, అచ్చంపేట, బస్టాండ్లలో కొనసాగుతునందని డీఎం తెలిపారు. అనంతరం డి పో మేనేజర్ ధరమ్సింగ్, ఎస్టీఐ శంకర్నాయక్, కిన్నెర మొగులయ్యను సన్మానించారు. కార్యక్రమంలో డీవీ స్వామి, కంట్రోలర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.