అచ్చంపేటరూరల్, జనవరి 29: శ్రీశైల ఉత్తర ద్వారంగా భాసిలుతున్న ఉమామహేశ్వర క్షేత్రాన్ని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. రష్యాకు చెందిన 50మంది ఆలయంలో స్వామివారికి పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆలయ విశిష్టత, వైభవాన్ని వివరించారు.
విదేశీ భక్తులు పరమేశ్వరుడికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. వారిని అర్చకులు శాలువాలతో సన్మానించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో (భిక్ష) అన్నదానం స్వీకరించారు.