మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి 27 : ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. పుర ఆదాయా న్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన వారు రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అప్పట్లో రూ.10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోగా అప్పడు నిర్ణయించిన ధర ప్రకారమే చెల్లింపులు చేసేలా ప్ర భుత్వం అనుమతిచ్చింది.
మార్చి 31 లోగా దరఖా స్తు చేసుకున్న వాళ్లు తమ ప్లాట్సైజ్ను బట్టి ఫీజు చె ల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మ హబూబ్నగర్ మున్సిపాలిటీలో 31,144 మంది దరఖాస్తు చేసుకోగా 659 పూర్తయి 2,075 దరఖాస్తులను బదిలీ చేశారు. మరో 29,069 దరఖాస్తు లు పెండింగ్లో ఉన్నాయి. భూత్పూర్లో 5,999 మంది దరఖాస్తు చేసుకోగా, 976 బదిలీ చేయగా, 5,023 పెండింగ్లో ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో 17,134 మందికి లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో లక్ష మందికిపైగా ప్రయోజనం చేకూరనున్నది.