మూసాపేట, ఏప్రిల్ 14 : ఒకప్పుడు ఆర్టీసీ అంటేనే ప్రత్యేక స్థానం ఉండేది. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని, ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అంటూ, చెయ్యి ఎత్తిన చోట ఆపాలనే నినాదాలు, ఆదేశాలు ఉండే వి. కానీ ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అవస్థలమయంగా మారింది. బస్సు లు ఆపడమే గగనమైంది. జా తీయ రహదారి రోడ్డు పొడవు నా ఉన్న గ్రామాల్లో ప్రతి స్టేజీ వద్ద ప్రయాణికులు పదుల సం ఖ్యలో వేచి ఉన్నా ఆర్టీసీ బస్సు లు ఆపకుండా వెళ్తున్నాయి. ఉచితాల పేరుతో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ప్రతి రోజూ అవస్థలు పడుతున్నారు. డ్రైవరన్నకు న చ్చితే ఆపినట్లు లేకుంటే లేదు. వారి ఇ ష్టంపై ఆయా స్టేజీల ప్రజల ప్ర యాణం ఆధారపడి ఉంటుం ది. కొన్ని సందర్భాల్లో గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు ఆపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం గద్వాల డిపోకు చెందిన టీఎస్ 33టీ2477 ఆర్టీసీ బస్సు ఉద యం 6:41 నిమిషాలకు మూసాపేట స్టేజీ వద్దకు వచ్చింది. కానీ అప్పటికే హైదరాబాద్కు వెళ్లేందుకు గంట ముందు నుం చే ఆ బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. కానీ ఆ బస్సు ఖాళీగా ఉన్నా ప్రయాణికులు ఎంత మంది చెయ్యి పైకెత్తి రోడ్డుపైకి వెళ్లి ఆపినా ఆపకుండా వెళ్లారు. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి ఇతర వాహనాల ద్వారా జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్నగర్కు వెళ్లి పోయారు. దీంతో బస్సు ఆపకుండా వెళ్లిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా రు. ఆర్టీసీ సిబ్బంది మాత్రం బస్సు ఆపుకుంటూ వెళ్తే ప్రయాణికులు ఓవర్ లోడ్గా ఎక్కుతున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ ప్రతి రోజూ దాదాపుగా అన్ని బస్సులు ఆపకుండా వెళ్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.