హన్వాడ, జనవరి 18 : ఈ ఏడాది హరితహారంలో భాగంగా మండలంలో 14 లక్షల మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 40 వేల మొక్కలు పెంచుతున్నారు. కొన్ని నర్సరీల్లో మట్టిని జల్లెడ పట్టి కవర్లలో నింపుతున్నారు. మరికొన్ని చోట్ల పనులు ప్రారంభించాల్సి ఉన్నది. వర్షాలు పుష్కలంగా కురిస్తే జూన్ లేదా జూలైలో ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలన్న ఉద్దేశంతో టేకు, వేప, చింత, వెదురు, కర్జూర, బత్తాయి, మునగ, మామిడి, జామ వంటి మొక్కలను పెంచుతున్నారు. ఎక్కువగా పూల మొక్కలకు ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఐదు నర్సరీలను ఏర్పాటు చేశారు. పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మండలంలోని 35 నర్సరీ ల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్యాకెట్లలో విత్తనాలు నింపుతున్నారు. ప్రతి వారం ఉపాధి హామీ సిబ్బం ది, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. మొక్కలు ఎండిపోకుండా పర్యవేక్షణ చేస్తున్నాం. ఈ సారి పండ్లు, పూల మొక్కలను ఎక్కువగా పెంచుతున్నాం.
– ధనుంజయగౌడ్, ఎంపీడీవో, హన్వాడ