మదనాపురం, మార్చి 22 : అంతుచిక్కని విషజ్వరాలు వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయి. 1600ల జనాభా కలిగిన ఈ గ్రామంలో 300లకు పైగా మంది విషజ్వరాల బారిన పడడంతో భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకు రోగుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆ గ్రామానికేమైందనే చర్చ మొదలైంది. విషజ్వరాలతోపాటు చికున్గున్యా కూడా తోడవడంతో కీళ్ల నొప్పులు, కాళ్ల వాపు రావడంతో నడువలేని పరిస్థితిలో ఉన్నారు. మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని బాధితులు వాపోతున్నారు. వైద్యాధికారులు గ్రామంలో నాలుగు రోజులపాటు హెల్త్ క్యాంప్ నిర్వహించి చేతులు దులుపుకొన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
దంతనూరులో ప్రజలు జ్వరాల బారినపడిన విష యం వాస్తవమే. వారం కిందట గ్రామంలో హెల్త్క్యాంప్ నిర్వహించాం. 50 మందికి పైగా బాధితుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం. ఒకరికి మాత్ర మే చికున్గున్యా ఉందని నిర్ధారణ అయ్యింది. మిగ తా వారికి వైరల్ ఫీవర్ వచ్చింది. శనివారం గ్రామం లో మరోసారి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం.