మహబూబ్నగర్, అక్టోబర్ 20 (న మస్తే తెలంగాణ ప్రతినిధి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ శాఖ నిర్లక్ష్యం మ హబూబ్నగర్ జిల్లా కేంద్రానికి శాపంగా మారింది. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ఏర్పాటు చేసిన చిన్నచిన్న కల్వర్టులను జాతీయ రహదారి శాఖ అధికారులు మూసివేయడంతో పాతపాలమూరులోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులన్నీ జలమయం కావడంతో మున్సిపల్ అధికారులు పరిశీలిస్తే అసలు కథ బయటపడింది. దీంతో వెం టనే కలెక్టర్ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సంబంధిత శాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు సి ఫార్సు చేశారు. ఈవిషయాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసెకెళ్లడంతో ఆ యన ఉన్నతాధికారులతో మాట్లాడారు. జాతీయ రహదారుల శాఖ ఇంజినీర్లు మాత్రం పాత కల్వర్టులన్నీ రోడ్డు నిర్మించేటప్పుడు మూసేసామని..వీటిని పరిగణలోకి తీసుకోలేదని జవాబివ్వడం వి వాదస్పదమైంది. మంత్రి ఆగ్రహం వ్య క్తం చేసి కల్వర్టులన్నీ పునరుదద్ధరించాలని ఉన్నతాధికారులతో మాట్లాడటం తో గురువారం కల్వర్టు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పాతపాలమూరులోని వల్లభ్నగర్, కుర్హినిశెట్టి కాలనీ, గణేశ్నగర్, మేనక థియేటర్ ప్రాంతాలు జలమయం కావడానికి జాతీయ రహదారుల శాఖ నిర్లక్ష్యమేనని బట్టబయలైంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజే పీ నేతలు నానా తంటాలు పడుతున్నారు.
కల్వర్టులను మాయం చేసిన ఆఫీసర్లు
మహబూబ్నగర్ -జడ్చర్ల మధ్య జాతీయ రహదారి అనుసంధానం చేస్తూ మూడేండ్లుగా జాతీయ రహదారుల శాఖ కొత్త నాలుగులేన్ల రహదారిని పనులు కొనసాగుతున్నాయి. కోదాడ -రాయిచూర్ వరకు జాతీయ రహదారి నెంబర్ -167 కింద పనులు 90శాతం పూర్తయ్యాయి. రూ. 192 కోట్లతో వీటిని చేపట్టారు. అయితే ఈశాఖ అధికారులు మాత్రం జడ్చర్ల -పాలమూరు యూనివర్సిటీ వరకు నిర్మిస్తున్న నాలుగులైన్ల రహదారిపై గతంలో ఆర్అండ్బీ మెయింటెనెన్స్ చేసిన కల్వర్టులను పునరుద్ధరించకుండా వాటిని మూసేసింది. వాన నీళ్లు పోయేందుకు నిర్మించిన కల్వర్టులను చిన్నవిగా చేయడం..కొన్నింటిని ఏకంగా మూసేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పాలమూరు జలదిగ్బంధంలో కూరుకుపోయింది.
కలెక్టర్ సీరియస్ అయినా..
జిల్లా కేంద్రంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాలుగు సార్లు భారీ వర్షాలు కురిశాయి. కొత్తచెరువుతో పాటు జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న పాత కాల్వలన్నీ పొంగాయి. జాతీయ రహదారి కింద ఉన్న కల్వర్టులు మూసేయడంతో వాన నీళ్లన్నీ కుర్హినిశెట్టి కాలనీ, వల్లభ్నగర్, గణేశ్నగర్, మేనకా థియేటర్, వన్టౌన్ ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. సమీక్షా సమావేశానికి కూడా అధికారులు గైర్హాజరు కావడంతో జాతీయ రహదారుల శాఖ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా పట్టించుకోకపోవడం..కోతకు గురైన రహదారిని మరమ్మతు చేయకపోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి ఆదేశాలతో రంగంలోకి…
జాతీయ రహదారుల శాఖ తీరుతో పట్టణంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని అశోక్టాకీస్, న్యూటౌన్, మెట్టుగడ్డ ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా నీటమునిగాయి. చివరకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి క ల్వర్టులను పునరుద్ధరించకపోతే భవిష్యత్తో నష్టం తీవ్రంగా ఉంటుందని..రహదారి వేసి ఏం లాభం అని నిలదీశారు. దీంతో అధికారులు పాత కల్వర్టులన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.
ఎంబీసీ కాంప్లెక్స్, న్యూటౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ సంగతేంది..?
అశోక్టాకీస్ చౌరస్తా నుంచి మేనకా టాకీస్ వరకు ఉన్న కల్వర్టులను పునరుద్ధరించేందుకు సిద్ధమైన అధికారులు మిగతా చాలా చోట్ల కమర్షియల్ కాంప్లెక్స్లూ మునుగుతుండడంపై పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. జాతీయ రహదారుల శాఖ ఇంజినీర్లు రహదారిని ఊహించని రీతిలో పెంచి వ ర్షం నీళ్లు నాలాల్లో వెళ్లే విధంగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని వ్యాపారులు అంటున్నారు. ఎంబీసీ కాంప్లెక్స్, న్యూటౌన్లోని మున్సిపల్ కాంప్లెక్స్ ముందు డ్రైనేజీ వ్యవస్థ బేస్మెంట్కు ఎత్తుగాఉంది. దీంతో కిందున్న నీళ్లు బయటకు వెళ్లే విధంగా ఎలాంటి చర్య లు తీసుకోకపోవడంతో వర్షం వస్తే చాలామంది దుకాణాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జాతీయ రహదారిని తామే తీసుకొచ్చామని చెప్పే బీజేపీ నేత లు జాతీయ రహదారుల శాఖ తప్పిదాలపై నోరు మెదపడం లేదు. లోపభూయిష్టంగా డిజైన్ చేసిన ఇంజినీర్లపై చర్య లు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. తూర్పుకమాన్ వద్ద కల్వర్టు పనులు ప్రారంభమయ్యాయని, ఇంకా మూడు చోట్ల కూడా పునరుద్ధరిస్తామని మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తెలిపారు.