మహ్మదాబాద్, ఫిబ్రవరి 20 : చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పౌష్టికాహారం అంద డం లేదు. చిన్నారుల ఎదుగుదల, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్రాల్లో గుడ్లు, పాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వ ల క్ష్యం బాగానే ఉన్నా కుళ్లిపోయిన గు డ్లను సరఫరా చేస్తుండడంతో వా టిని తినలేక లబ్ధిదారులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉమ్మడి గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో మూడు అంగన్వాడీ సెక్టార్లు ఉండగా, గండీడ్ 14, నంచర్ల 14, మ హ్మదాబాద్కు 28 కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిద్వారా ప్రతి రోజూ చిన్నారులకు విద్యను అం దించడంతోపాటు పౌష్టికాహారం ఇవ్వాలి. ఈనెల 8వ తేదీ నుంచి మండలంలోని పలు కేంద్రాలకు గుడ్లు రాగా నాణ్యత లేకుండా, ఉడకబెట్టగా, పగిలిపోయి దుర్గంధం వెదజల్లుతున్నది. 90శాతం గుడ్లు ఇలానే పాడైపోయినవి ఉండడంతో చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అం గన్వాడీ టీచర్లు ఉన్నతాధికారు లకు చెప్పినా ఎలాంటి ఫలితం లేదని చెబుతున్నారు. నాణ్యతలేని గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు పం పిణీ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. గతంలో ఇ లాగే జరిగితే కాంట్రాక్టర్పై ఉన్నతాధికారులకు చె ప్పాం. రెండు నెలలు బాగానే పంపిణీ చేశారు. మళ్లీ బాగాలేని గుడ్లు సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వ చ్చాయి. అంగన్వాడీ టీచర్లు గుడ్లు వచ్చినప్పుడు ఒకటి, రెండు పగులగొట్టి చూడాలి. బాగాలేవని తె లిస్తే వాటిని తిరిగి పంపించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.