నాగర్కర్నూల్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారించగా ఊహించని విధంగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వి డుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటూ కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కశిరెడ్డి నారాయణరెడ్డి స్థానానికి మార్చి 28న ఎన్నికలు నిర్వహించనున్నది. దీనికోసం ఎన్నికల సం ఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి కశిరెడ్డి నారాయణరెడ్డితోపాటు కూచకుళ్ల దామోదర్రెడ్డి 2021లో ఎన్నికయ్యారు. పదవీ కాలం ఆరేండ్లపాటు ఉంటుంది. కాగా నారాయణరెడ్డి కాంగ్రె స్ పార్టీలో చేరి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో నాలుగేండ్ల ముందుగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఈ ఎ న్నిక నిర్వహణపై రాజకీయ పార్టీలు, నాయకులు ఎదు రు చూస్తుండగా సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడ్డా యి. ఎంపీ ఎన్నికల తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉం టుందని భావించగా ఎన్నికల సంఘం అనూహ్యంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తక్షణమే ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నోటిఫికేషన్తో ఎంపీ ఎన్నికలకు ముందే ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరులో రాజకీయం వేడెక్కనున్నది. కాగా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో జరిగిన మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అత్యధికంగా విజయం సాధించారు. ఇటీవల కాంగ్రెస్కు చెందిన కౌన్సిలర్లు, గులాబీ నేతలను చేర్చుకుంటున్నా అత్యధికులు బీఆర్ఎస్తోనే ఉన్నారు. ఇటీవల పార్లమెంట్ నిర్వహించిన సన్నాహక సమీక్షల్లోనూ బీఆర్ఎస్ నాయకత్వం బలంగా కనిపించింది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉండటంతో సర్పంచ్ ఎన్నికలకు సైతం కాంగ్రెస్ సర్కారు వెనుకడు గు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా ఉప ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో ఆదరణ తగ్గుతుండడంతో ఈ ఉప ఎన్నికలు ఆ ప్రభావాన్ని మరింత పెంచనున్నాయి. బీఆర్ఎస్ అ ధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీలో టికెట్ల కోసం పోటీలు లేకుండా, క్యాడర్లో క్రమశిక్షణ నెలకొన్నది. కాంగ్రెస్లో మాత్రం నాయకులు, క్యాడర్ గ్రూపులుగా విడిపోయి బహిరంగంగా విభేదాలను రచ్చకెక్కిస్తున్నా రు. ఈ పరిణామాలు కూడా బీఆర్ఎస్, ప్రజల్లో గు లాబీ పార్టీపై విశ్వాసాన్ని పెంచుతున్నది.
కోడ్ అమలులోకి వచ్చిన 24 నుంచి 72 గంటల్లో గా నియమావళి అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అధికారు లు పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఎన్నికల విధు లు నిర్వహించాలి. ఇక కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లలో రాజకీయ పార్టీల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, జెం డాలు, గోడ రాతలు లేకుండా చర్యలు తీసుకోనున్నా రు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో ఆర్డీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. కాగా స్థానిక సంస్థల సమావేశాల కోసం జిల్లా ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలను వాయిదా వేయనున్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగతంగా, రాజకీయ కార్యక్రమాలకు వినియోగించరాదు. ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. అలాగే అధికారులు, ఇతర అన్ని రకాల ఉద్యోగులు కూడా రాజకీయ నాయకులను కలవడం, రాజకీయ కార్యక్రమా ల్లో పాల్గొనడం నిషేధం. ఎవరైనా ఉద్యోగులు ఎన్నిక ల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే వెంటనే సస్పెండ్ చేయనున్నారు. ఎన్నికల ప్రచారాలు, రాజకీయ పార్టీల సమావేశాలను ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఎప్పటికప్పుడు వీడియో తీసి ఎన్నికల సంఘానికి చేరవేస్తాయి. నియమావళి ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది. అధికారులు కోడ్ను ఉల్లంఘిస్తే ఆర్పీ యాక్ట్ 129ప్రకారం చర్య లు తీసుకోనున్నారు. నియమావళి ఉల్లంఘనకు సం బంధించిన సమస్యలుంటే జిల్లా ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నది.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 27 : మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికకు సంబంధించి మార్చి 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి పరిధిలోని మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాం బ గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 4న నోటిఫికేషన్ జారీ, నామినేషన్కు గడువు 11, 12న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, మార్చి 14న తుది గడువు, మార్చి 28 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు, 4వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలియజేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్, వా హన అనుమతులు సంబంధిత కలెక్టర్ల నుంచి పొం దొచ్చని తెలిపారు.