మహబూబ్నగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఆయా నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. నారాయణపేట, జడ్చర్ల, గద్వాల, వనపర్తి నియోజకవర్గాల్లో విపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్గర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఐదు చొప్పున, అలంపూర్లో నాలుగు, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అచ్చంపేటలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి తరఫున ఆయన సతీమణి మర్రి జమున సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 43మంది నామినేషన్లు ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నామినేషన్ సమర్పించే కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ తరఫున ఏపీ మిథున్రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఎన్నం శ్రీనివాస్రెడ్డి, బీఎస్పీ నుంచి స్వప్న, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎం.శ్రీనివాసులు, మల్కాపురం శ్రీనివాస్గౌడ్ నామినేషన్లు వేశారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్సీపీఐ పార్టీ తరఫున వెల్జాల బసవయ్య, బీఎంపీ నుంచి ఇమ్మడి ఆనంద్, నేషనల్ కాంగ్రెస్ నుంచి అనిరుధ్రెడ్డి, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి జి.మధుసూదన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ఆరోరోజు మొత్తం 21మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో తొమ్మిది మంది, కొల్లాపూర్ నుంచి నలుగురు, అచ్చంపేట నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు రెండుసెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి సతీశ్మాదిగ, బహుజన సమాజ్వాదిధి పార్టీ తరఫున ఎం.నాగార్జున్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున చిక్కుడు వంశీకృష్ణ, ధర్మ సమాజ్ పార్టీ తరఫున చింత సాయిబాబు నామినేషన్ దాఖలు చేశారు.
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మర్రి జనార్దన్రెడ్డి రెండుసెట్ల నామినేషన్లు వేయగా.. ఆయన సతీమణి మర్రి జమున బీఆర్ఎస్ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు. ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి జాడిస్వామి, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సక్యత కేంద్రం మార్కిస్ట్ లెనినిస్ట్ పార్టీ నుంచి కడుకుంట్ల జానకిరాంరెడ్డి, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూచకుళ్ల రాజేశ్రెడ్డి తరఫున కూచకుళ్ల దామోదర్రెడ్డి, భారత సంయుక్త రాష్ర్టాల కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మిద్దె రాములు, స్వతంత్ర అభ్యర్థులుగా మూడావత్ బాలరాజు, చీమర్ల రాజేశ్వర్రెడ్డి, నరిగే నరేందర్ నామినేషన్ వేశారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి నుంచి రాణి, ధర్మసమాజ్ పార్టీ నుంచి ఆదిసంధ్య, బీఎస్పీ తరఫున గగనం శేఖరయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా కర్నె శిరీష, కాటగౌని తిరుపతమ్మ నామినేషన్లు వేశారు. కల్వకుర్తి నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరఫున జైపాల్యాదవ్ భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు.
ప్రజాబంధు పార్టీ తరఫున వి.అమర్నాథ్, స్వతంత్ర అభ్యర్థిగా వి.రేఖ్యానాయక్ నామినేషన్ దాఖలు చేశారు.మక్తల్ నియోజకవర్గానికి లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ తరఫున మంజుల మేతరి బహుజన నామినేషన్ దాఖలు చేశారు. నారాయణపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పర్ణికరెడ్డి, బీజేపీ నుంచి రతంగ్పాండురెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బొదిగెలి శ్రీనివాసులు నామినేషన్ వేశారు. వనపర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున తుడి మేఘారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా గొండి వెంకటరమణ, ధర్మ సమాజ్ పార్టీ తరఫున బంకల ఎల్లయ్య నామినేషన్ దాఖలు చేశారు. గద్వాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సరిత, బీఎస్పీ తరఫున పరమాల కృష్ణ నామినేషన్లు వేశారు. అలంపూర్కు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపత్కుమార్, ధర్మ సమాజ్ పార్టీ తరఫున లక్ష్మన్న, బీజేపీ తరఫున మాదన్న, ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పేరపోగు ప్రసంగి నామినేషన్ వేశారు.