మహబూబ్నగర్ : స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజులలైనా ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్లను స్వీకరణ ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభమైంది.
గురువారం కూడా ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట రావు తెలిపారు. ఈనెల 16 నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక్షల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని..ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.