దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో గల మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్లో ఆదివారం సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు 31అడుగుల నీటినిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 32.6 అడుగులు(2.27 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 31అడుగుల వద్ద ఉంది. నారా యణపేట, కొడంగల్, మద్దూర్ మండలాలకు 10 కూసెక్కుల నీరు త్రాగునీటి అవసరాలకై తరలింపు కొనసాగుతుంది.