బాలానగర్, జనవరి 1: మండలంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకొన్నారు. యువకులు, మహిళలు, చిన్నారులు ఇండ్లల్లోనే నృత్యాలు చేశారు. ఇండ్ల ఎదుట వాకిళ్లలో రంగువల్లులు వేశారు. శనివారం ఉదయం మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి, భవానీ మాతా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.
ఆలయాల్లో పూజలు
మిడ్జిల్, జనవరి 1: మండలంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకొన్నారు. ప్రజలు ఇండ్ల ముందు కల్లాపి చల్లి, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముగ్గులు వేశారు. నూతన వస్ర్తాలు ధరించి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
అడ్డాకుల ఎంబీ చర్చిలో..
మూసాపేట(అడ్డాకుల), జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అడ్డాకుల ఎంబీ చర్చిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని గ్రామాల్లో వేడుకలను ఉత్సాహంగా జరుపుకొన్నారు.
చిన్నచింతకుంటలో..
దేవరకద్ర రూరల్, జనవరి 1: చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎంబీ సియోను సంఘంలో శనివారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం కాపరి రెవ, ఐజక్ అధ్యక్షతన కీర్తనలు, పాటలు పాడి అలరించారు. జోయల్ ముఖ్య సందేశాన్ని అందించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో సంఘ చైర్మన్ మోషె, వైస్చైర్మన్ ప్రకాషం, సభ్యులు యోనా, ఆనంద్, సామేలు, సుదర్శన్, పిలోగు, యాకోబ్ పాల్గొన్నారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో..
మహబూబ్నగర్, జనవరి 1: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు శుక్రవారం ఘనంగా చేశారు. కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్నందలాల్పవర్తో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, వివిధ శాఖల ఉద్యోగులు ఉన్నారు.
కలెక్టర్కు శుభాకాంక్షలు
మహబూబ్నగర్టౌన్, జనవరి1: నూతన సంవత్సర సందర్భంగా శనివారం కలెక్టర్ వెంకట్రావును పీఆర్టీయూటీఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణగౌడ్, రఘురాంరెడ్డి, గౌరవాధ్యక్షుడు గోపాల్నాయక్, గోపాల్గౌడ్, రాష్ట్ర సభ్యులు హరినాథ్, జయపాల్రెడ్డి, బుచ్చారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అశ్వినిచంద్రశేఖర్, రేవతి, సావిత్రి, రాంచంద్రయ్య, పురుషోత్తంగౌడ్, రమాదేవి పాల్గొన్నారు.
మన్యంకొండకు పాదయాత్ర
మహబూబ్నగర్రూరల్, జనవరి1: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి మన్యంకొండ దేవస్థానం వరకు 150మంది ఆర్య వైశ్య సంఘ సభ్యులు శనివారం పాదయాత్ర చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా మహబూబ్నగర్ ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జి.వెంకటేశ్, మన్యంకొండ దేవస్థానం కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్, రాజేశ్వర్, కొండా చక్రధర్ గుప్తా, నాగరాజు, మిర్యాల వేణుగోపాల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనురాగిణి ఆశ్రమంలో..
జడ్చర్ల, జనవరి 1: జడ్చర్లలోని అనురాగిణి ఆశ్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్ నూతన సంవత్సరం సందర్భంగా శనివారం అనాథ పిల్లలతో కలసి వేడుకలను నిర్వహించారు. చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ వేడుకలు అనాథపిల్లలతో కలసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆశ్రమానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురాగిణి ఆశ్రమం నిర్వాహకులు మంచన విఠలయ్య, కమిటీ సభ్యులు ఉన్నారు.