నాగర్కర్నూల్, జనవరి 11: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బుధవారం జిల్లాకు కొత్త ఈవీఎంలు చేరుకున్నాయి. మూడు భారీ వాహనాల్లో వచ్చిన ఈవీఎంల సీల్లను జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాను సారం హైదరాబాద్ ఈసీఎల్ నుంచి జిల్లాకు 1433 బ్యాలెట్ యూనిట్లు, 1119 కంట్రోల్ యూనిట్లు వచ్చాయన్నారు. ఈవీఎంలు భద్రపరిచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకో వాలని, గోదాంలో విద్యుత్ సమస్యలుంటే రిపేర్లు చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఈవీఎంల బ్యాక్సుల నెంబర్లను సరి చూసుకొని రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూయించి వారి సమక్షంలో భద్రపరచాలన్నారు. గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు కొత్త ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాంలో భద్ర పరిచారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ప్రకాశ్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, ఎన్నికల సెక్షన్ అధికారి కరుణాకర్, శ్రీనివాసులు, అశోక్, బీఆర్ఎస్ పార్టీ నుంచి చంద్రశేఖర్రెడ్డి, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నుంచి హుస్సేన్, కాంగ్రెస్ నుంచి శ్రీను, బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.