అలంపూర్, జనవరి 23 : స్వాతంత్య్ర పోరాటం లో నేతాజీ సేవలు మరువలేనివని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నా రు. మంగళవారం అలంపూర్లోని బ్రాహ్మణవీధి లో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసి మొట్టమొదటి సారి జై హింద్ అనే నినాదం ఇచ్చిన వారు నేతాజీ అన్నా రు. అప్పట్లోనే ఎన్నో పదవులను త్యాగంచేసి దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. దేశ నాయకుల్లో మరణం లేని వ్యక్తిగా చరిత్రకెక్కారన్నారు. యువత నేటి సమాజంలో నేతాజీ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు చి న్నారుల కూచిపూడి నృత్యం, సాంస్కృతిక కార్యక్ర మాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయుడు మాధవరాయుడు ఆధ్వర్యంలో మాంటిస్సోరి విద్యార్థులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా నేతాజీ ఫ్రెండ్స్ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్శర్మ, వెంకట్రామయ్యశెట్టి, జాగృతి సాహితీ జిల్లా కన్వీనర్ ఇల్లూరి వెంకట్రామయ్యశెట్టిని అతిథులు అభినందించగా నిర్వాహకులు ఎ మ్మెల్యే, ఎమ్మెల్సీలను సన్మానించారు. కార్యక్రమం లో నేతాజీ ఫ్రెండ్స్ సేవా సమితి సభ్యులు సూరిబాబు, శివప్రసాద్, మల్లికార్జున్, మధుతోపాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొనసాగతున్న ప్ర సాద్ స్కీం పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా అన్నారు. అలంపూర్ క్షేత్రంలో రూ.36 కోట్లతో కొనసాగుతున్న పనులను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భం గా వారు డీఈ ధన్రాజ్, ఏఈ రామకృష్ణను పనుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి తో మాట్లాడి పనులు వేగవంతం చేసేందుకు చర్య లు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. వారి వెం ట ఆలయ పాలక మండలి చైర్మన్ చిన్ని కృష్ణయ్యనాయుడు, ఆలయ ధర్మకర్తలు ఉన్నారు.