మూసాపేట, నవంబర్ 25 : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మండలంలోని చక్రాపూర్, వేముల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రైతుల నుంచి తక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల నుంచి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా నిర్లక్ష్యం చేయ డం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు ఏ మాత్రం అలసత్వం చేయొద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. రైస్మిల్లర్లు తరుగు ఎక్కువ తీయకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమం లో సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
వానకాలంలో పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. జడ్చర్లలోని పత్తి మార్కెట్యార్డులో బాదేపల్లి పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడారు. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. చివరి గింజ వరకూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. అనంతరం పోలేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సింగిల్విండో ఉ పాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు వెంకటేశ్, అశోక్గౌడ్, నర్సింహారావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యత పాటించాలి : జేడీఏ
రైతులు ధాన్యంలో నాణ్యత లోపించకుండా చూడాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సుచరిత కోరారు. గురువారం మండలంలోని తాటికొండ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యంలో తేమశాతం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, తాలు, మట్టిపెల్లలు, గడ్డి లేకుండా చూడాలన్నారు. వర్షాలు కురిసే అవకా శం ఉన్నందున ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ యశ్వంత్రావు, ఏవో మురళీధర్, ఏఈవో ప్రదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డబ్బులు త్వరగా అందేలా చూడాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు త్వరగా అందేలా చూడాలని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలకేంద్రంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ మద్దూరి జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, చంద్రమోహన్రెడ్డి, బాలరాజు, మహేశ్యాదవ్ పాల్గొన్నారు.
1,030 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 1,031 మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించినట్లు ఏపీఎం సునీత తెలిపారు. గురువారం మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా ఏపీఎం మాట్లాడుతూ రైతులు ధాన్యంలో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధా న్యాన్ని ఆరబెట్టి తూర్పారబట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోలుపై రోజూవారీగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. మండలంలో రైతుల నుంచి 1,030 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీలు మల్లేశ్, నరేశ్, భద్రూనాయక్, కవిత తదితరులు పాల్గొన్నారు.