పాలమూరు, డిసెంబర్ 17 : పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఈనెల 18, 19వ తేదీల్లో సోషల్ వర్క్ విభాగం వారి ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ మానసిక చేయూత అందించడంలో ‘సంఘ సేవకుని పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మార్క్ పోలోనియస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పీయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎల్బీ. లక్ష్మీకాంత్రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు హాజరుకానున్నట్లు తెలిపారు.