మక్తల్ టౌన్, సెప్టెంబర్ 29 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ పార్టీకి చెందిన నర్సిరెడ్డిపల్లి సర్పంచ్ అనిత బీఆర్ఎస్లో చేరారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో కార్యకర్తలతో కలిసి ఆమె బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
నూతనంగా ఏర్పడిన జీపీని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. అనంతరం మక్తల్ నుంచి నర్సిరెడ్డిపల్లికి రూ.18లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ లక్ష్మీనారాయణ, జౌలాపురం సర్పంచ్ ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.