దామరగిద్ద: ప్రభుత్వం ప్రతి వ్యక్తిపై శ్రద్ధ వహిస్తుందని ఎమ్యెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. మండంలోని మొగల్ మడ్క గ్రామంలో పాఠశాల అదనపు గదులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి వ్యక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వారికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందింస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా మండంలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యేను పేట మార్కెట్ చైర్మన్ భాస్కరా కుమారి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, రైతు సేవా సమితి జిల్లా సభ్యులు వెంకట్రెడ్డి, పుట్టి అంజి తదితరులు పాల్గొన్నారు.